AP Farmers: రైతులకు శుభవార్త చెప్పిన ఏపీ కూటమి ప్రభుత్వం.

0
166

ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది రైతులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సాగు సీజన్ ప్రారంభానికి ముందే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

ఈ నెలాఖరులోగా పెండింగ్ దరఖాస్తులన్నింటికీ అనుమతులు జారీ చేయాలని, రెండు నెలల్లోగా కనెక్షన్లను పూర్తిగా ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కంలను) ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ కోసం సుమారు రూ.250 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి అవసరమైన 10,000 కొత్త ట్రాన్స్‌‌ఫార్మర్లను కేటాయించనుంది. 

 

ఈ విషయంపై ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, రెండు నెలల్లోగా పెండింగ్ కనెక్షన్లన్నీ ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని డిస్కంలను ఆదేశించామన్నారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే 22.30 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా 1.12 లక్షల కనెక్షన్లను మంజూరు చేసింది. తాజా నిర్ణయంతో మరో 46 వేల మందికి పైగా రైతులకు వ్యవసాయ పనులకు విద్యుత్ సౌకర్యం అందనుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
మహిళా క్రీడాకారిణులకు ‘శక్తి టీం’ శక్తి యాప్ పై అవగాహన
చీరాల, మహిళలు, చిన్నారుల రక్షణే ధ్యేయంగా బాపట్ల జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు....
By Vadlamudi NagaVenkat 2026-06-11 10:16:39 0 178
Andhra Pradesh
ముస్లిం... మైనారిటీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది - ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య
కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభివద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉందని చీరాల శాసనసభ్యులు...
By Vadlamudi NagaVenkat 2026-03-21 08:06:30 0 580
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో 148 మంది పోలీసుల బదిలీ.
అన్నమయ్య జిల్లాలో భారీ స్థాయిలో పోలీసు బదిలీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 148 మంది పోలీస్...
By Pagadala Venkateswar 2026-04-05 05:43:42 0 164
Andhra Pradesh
పిల్లల ఆరోగ్యం ప్రభుత్వ లక్ష్యం !! కర్నూలు ఎంపి!!
కర్నూలు : రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి...
By Hari Krishna 2025-12-21 09:51:26 0 187
Andhra Pradesh
"షైనింగ్ అవార్డు" అందుకున్న పుంగనూరు అమ్మాయి "అక్షిత"
మదనపల్లిలో ఈరోజు ఎమ్మెల్యే షాజహాన్ భాష గారి చేతుల మీదుగా "షైనింగ్  అవార్డు" అందుకున్న...
By Kothuru Murali 2026-07-20 15:50:30 0 37
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com