Chandrababu Naidu: ప్రజలకు హోలీ శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్.

0
150

సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు

చెడుపై మంచి గెలుపునకు సూచిక ఈ పండుగ అన్న సీఎం చంద్రబాబు

సమత, మమతలకు హోలీ ప్రతీక అని పేర్కొన్న లోకేశ్

హోలీ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగను పురస్కరించుకుని ఈరోజు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా తమ సందేశాలను పంచుకున్నారు. 

 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. ‘హోలీ పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. చెడుపై మంచి గెలుపునకు సూచికగా ‘కామ దహనం’తో ప్రారంభమయ్యే హోలీ పండుగ మనందరి జీవితాల్లో కొత్త రంగులు అద్దుతుంది. బంధుమిత్రులతో, సాటివారితో ఆనందం పంచుకుని అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’ అని తన పోస్టులో పేర్కొన్నారు. 

 

మంత్రి నారా లోకేశ్ తన సందేశంలో.. ‘వ‌సంత రుతువుకు స్వాగ‌తం ప‌లికే రంగుల సంబ‌రం హోలీ. చెడుపై గెలిచిన మంచికి సంకేతం హోలీ. స‌మ‌త‌, మ‌మ‌త‌ల‌కు చిహ్నంగా, పేదా, పెద్ద తార‌త‌మ్యాలు లేకుండా, కుల‌మ‌త భేదాలు చూడ‌కుండా రంగుల్లో అంతా క‌లిసిపోయి ఆనందాల‌ను పంచుకునే హోలీ పండుగ సంద‌ర్భంగా శుభాకాంక్షలు’ అని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కలెక్టర్ గారిని డిఎస్పి గాని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు
కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, డీఎస్పీ మహేందర్ లను శుక్రవారం పుంగనూరు...
By Kothuru Murali 2026-01-02 13:02:45 0 189
SURAKSHA
మహిళా భద్రతపై పోలీసుల ప్రత్యేక అవగాహన సదస్సులు
మహిళల రక్షణ కోసం తెలంగాణ పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. కాలేజీలు, కార్యాలయాలు, బహిరంగ...
By Kalaga Sailaja 2026-06-30 08:51:47 0 57
Karnataka
See ntr statue open in Karnataka sindanoor.
సింధనూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్   రాయచూర్ జిల్లా...
By G k Nookala 2026-04-04 10:26:33 0 199
BMA
📈 India’s Media & Entertainment Sector Hits ₹2.5 Trillion — Growth Brings New Hope and New Challenges
📈 India’s Media & Entertainment Sector Hits ₹2.5 Trillion - Growth Brings New Hope and...
By BMA ADMIN 2025-05-03 09:19:22 1 3K
Andhra Pradesh
విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం: మంత్రి గొట్టిపాటి.
AP: వచ్చే మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఇప్పటికే...
By Pagadala Venkateswar 2026-01-24 06:39:18 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com