వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.... మహిళతో పాటు ఏడు గేదెల మృతి..

0
153

బాపట్ల జిల్లా: వాడరేవు నుండి పిడుగురాళ్లకు వెళ్లే జాతీయ రహదారి–167పై సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అశోక్ లేలాండ్ మినీ వ్యాన్ అతివేగంగా వెళ్లి రోడ్డుపై నడుస్తున్న మహిళను మరియు ఆమె వెంట ఉన్న గేదెలను ఢీకొట్టింది.
స్థానికుల సమాచారం మేరకు ప్రమాదానికి ప్రధాన కారణం వాహనం అతివేగమేనని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో చీరాల మండలం ఈపురుపాలెం గ్రామం స్థావరం పాలెంకు చెందిన కొమ్మనబోయిన సుబ్బయ్యమ్మ (60) అక్కడికక్కడే మృతి చెందారు.
ఆమె తనకు చెందిన గేదెలను పొలంలో మేపుకుని ఇంటికి తీసుకెళ్తుండగా ఈ విషాదం జరిగింది. ప్రమాదంలో మొత్తం ఏడు గేదెలు కూడా మృత్యువాత పడ్డాయి.
సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ దుర్ఘటనతో ఆ ప్రాంతమంతా దుఃఖంలో మునిగిపోయింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Search
Categories
Read More
Andhra Pradesh
దుర్గ గుడికి లక్ష విరాళం
*దుర్గగుడి అభివృద్ధికి లక్ష విరాళం*     విశాఖపట్నంలోని మాధురవాడకు చెందిన వంగపండు...
By Rajini Kumari 2025-12-31 10:19:50 0 152
Telangana
స్టేడియాలు ఓపెన్ పబ్‌లా?.. కాన్సర్ట్‌ల తర్వాత చెత్త రాజ్యం.|
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో క్రీడా మైదానాల వినియోగంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి....
By Sidhu Maroju 2026-04-02 07:57:24 0 116
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఐదు మండలాలకు 10 లక్షల కవర్లు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచర్ల మండలాల్లోని మామిడి...
By Kothuru Murali 2026-02-10 07:21:51 0 84
Telangana
చేనేత కార్మిక పారిశ్రామిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతి కుమార్ డిమాండ్.
    *చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మార్చి 25వ తేదీన ఇందిరాపార్క్ హైదరాబాద్...
By Thalakokkula Sadanandam 2026-03-20 09:06:04 0 217
Telangana
బాచుపల్లి హైడ్రా కూల్చివేతలపై ప్రణీత్ అంటీలియా వాసుల నిరసనలు
మేడ్చల్ జిల్లా బాచుపల్లి ప్రాంతంలో ఉన్న ప్రణీత్ ఆంటీలియా గ్రేటెడ్ కమ్యూనిటీ వాసులు హైడ్రాపై తీవ్ర...
By Ponnala Srinivasrao 2026-03-13 07:49:30 0 193
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com