వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.... మహిళతో పాటు ఏడు గేదెల మృతి..
బాపట్ల జిల్లా: వాడరేవు నుండి పిడుగురాళ్లకు వెళ్లే జాతీయ రహదారి–167పై సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అశోక్ లేలాండ్ మినీ వ్యాన్ అతివేగంగా వెళ్లి రోడ్డుపై నడుస్తున్న మహిళను మరియు ఆమె వెంట ఉన్న గేదెలను ఢీకొట్టింది.
స్థానికుల సమాచారం మేరకు ప్రమాదానికి ప్రధాన కారణం వాహనం అతివేగమేనని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో చీరాల మండలం ఈపురుపాలెం గ్రామం స్థావరం పాలెంకు చెందిన కొమ్మనబోయిన సుబ్బయ్యమ్మ (60) అక్కడికక్కడే మృతి చెందారు.
ఆమె తనకు చెందిన గేదెలను పొలంలో మేపుకుని ఇంటికి తీసుకెళ్తుండగా ఈ విషాదం జరిగింది. ప్రమాదంలో మొత్తం ఏడు గేదెలు కూడా మృత్యువాత పడ్డాయి.
సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ దుర్ఘటనతో ఆ ప్రాంతమంతా దుఃఖంలో మునిగిపోయింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz