వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.... మహిళతో పాటు ఏడు గేదెల మృతి..

0
180

బాపట్ల జిల్లా: వాడరేవు నుండి పిడుగురాళ్లకు వెళ్లే జాతీయ రహదారి–167పై సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అశోక్ లేలాండ్ మినీ వ్యాన్ అతివేగంగా వెళ్లి రోడ్డుపై నడుస్తున్న మహిళను మరియు ఆమె వెంట ఉన్న గేదెలను ఢీకొట్టింది.
స్థానికుల సమాచారం మేరకు ప్రమాదానికి ప్రధాన కారణం వాహనం అతివేగమేనని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో చీరాల మండలం ఈపురుపాలెం గ్రామం స్థావరం పాలెంకు చెందిన కొమ్మనబోయిన సుబ్బయ్యమ్మ (60) అక్కడికక్కడే మృతి చెందారు.
ఆమె తనకు చెందిన గేదెలను పొలంలో మేపుకుని ఇంటికి తీసుకెళ్తుండగా ఈ విషాదం జరిగింది. ప్రమాదంలో మొత్తం ఏడు గేదెలు కూడా మృత్యువాత పడ్డాయి.
సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ దుర్ఘటనతో ఆ ప్రాంతమంతా దుఃఖంలో మునిగిపోయింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం దోర్నాల మండలం గంటవాని పల్లె దగ్గర వెలుగొండ ప్రాజెక్ట్ పీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేయనున్నసీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం   దోర్నాల మండలం గంటవాని పల్లె...
By Chennaiah Kati 2026-02-19 12:12:06 0 290
Andhra Pradesh
శివాజీ అనసూయ లో ఎవరిని సమర్థిస్తారు?హీరోయిన్ల డ్రెస్సులు పై శివాజీ కామెంట్స్
శివాజీ, అనసూయలో ఎవరిని సమర్ధిస్తారు ? హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ వ్యాఖ్యలు  దానికి...
By Rajini Kumari 2025-12-24 10:43:59 0 173
Andhra Pradesh
ఎమ్మిగనూరు వైయస్ఆర్ సి.పి ఇంచార్జ్ బుట్టా రేణుక
ఎమ్మిగనూరు వైయస్ఆర్ సి.పి ఇంచార్జ్ బుట్టా రేణుక గారిని మరియు పార్టీ సీనియర్ నాయకులు బుట్టా శివ...
By mahaboob basha 2025-07-06 15:05:09 0 1K
Andhra Pradesh
నారాయణ పాఠశాలలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.
స్థానిక మదనపల్లి పట్టణంలోని నారాయణ పాఠశాలలో జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలు అంగరంగ వైభవంగా...
By Pagadala Venkateswar 2026-01-26 11:58:49 0 142
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com