చీరాలలో అనుమతులు లేకుండా సెల్ టవర్ నిర్మాణం.. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం – స్థానికుల ఆందోళన
చీరాల: చీరాల పట్టణంలోని వుడ్ నగర్ ప్రాంతంలో అనుమతులు లేకుండా సెల్ టవర్ నిర్మాణం చేపడుతున్నారనే ఆరోపణలతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ శశి బాబు గారి నివాస సమీపంలో, డాక్టర్ ఎక్స్రే సెంటర్ ఎదుట ఉన్న బహుళ అంతస్తు భవనంపై ఈ టవర్ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు సమాచారం.
స్థానికుల వాదన ప్రకారం, ఈ నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ అధికారుల అనుమతులు తీసుకోలేదని, అలాగే పరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో 60 సంవత్సరాలు పైబడిన వైద్యులు, వృద్ధులు మరియు కుటుంబాలు అధికంగా నివసిస్తున్నారని వారు పేర్కొన్నారు.
సెల్ టవర్ల నుంచి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, నిద్రలేమి, నరాల బలహీనత వంటి సమస్యలు ఉద్భవించవచ్చని వారు భయపడుతున్నారు. వృద్ధులు మరియు ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది మరింత ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు.
ఈ విషయాన్ని స్థానిక వైద్యుడు డాక్టర్ శశి బాబు గారు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, తగిన స్పందన రాలేదని తెలిపారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశాన్ని తేలికగా తీసుకోవడం సరికాదని వారు పేర్కొన్నారు.
దీంతో సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు బాపట్లలో నిర్వహించిన "స్పందన" కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు. టవర్ నిర్మాణానికి సంబంధించిన అనుమతుల వివరాలు వెల్లడించాలని, నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేసి పూర్తి స్థాయి పరిశీలన చేయాలని వారు డిమాండ్ చేశారు.
#Narendra
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz