ఈనెల 4న పీసీసీ చీఫ్‌ షర్మిల జిల్లా పర్యటన. పర్చూరు,చీరాలలలో ఉపాధి పథకంపై రచ్చబండ విలేకరుల సమావేశంలో పర్యటన వివరాలను వెల్లడించిన కాంగ్రెస్ పార్టీనేతలు.

0
143

చీరాల: ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈనెల 4వ తేదీ బుధవారం  బాపట్ల జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.జిల్లా పార్టీ అధ్యక్షులు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆదేశాలతో సోమవారం వేటపాలెం మండలం కొత్తపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియెజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు  పీసీసీ చీఫ్‌ షర్మిల పర్యటన వివరాలను మీడియాకు వెల్లడించారు.ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈనెల 4 వ తేదీ బుధవారం పర్చూరు నియెజకవర్గం ఇంకొల్లు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి చీరాల నియెజకవర్గంలోని వేటపాలెం మండలం కొత్త పేట గ్రామంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారని స్వష్టం చేశారు.కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారన్నారు.కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు నుంచి మహాత్మగాంధీ పేరు తొలగించి, పథకం పేరు మార్చిన వైనాన్ని ఆమె ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందన్నారు.అనంతరం కాంగ్రెస్‌ నాయకులతో సమావేశమై పార్టీని బలోపేతం చేయడంపై చర్చించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మార్పు గ్రెగొరీ ,ఏపీసీసీ మెంబర్ సయ్యద్ అల్లిం  బాబు, కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరి వాసు ,మాజీ కౌన్సిలర్ మల్లెల బుల్లిబాబు ,షేక్ రెహమాన్ ,మిరియాల శ్రీనివాస్, దేవరపల్లి బాబురావు ,AMC మాజీ డెరెక్టర్ కనపర్తి బజ్జిబాబు ,మేరిగ ఇస్సాక్, మేరిగ రమేష్ ,పులి శంకర్ తదితరాలు పాల్గొన్నారు .

 

#Narendra

Search
Categories
Read More
Telangana
వైదిక బ్రాహ్మణ సంఘం నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించండి : ఎమ్మెల్యే వినతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :    డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ...
By Sidhu Maroju 2025-12-16 13:20:51 0 181
Telangana
NZB: ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల  బలూరా హాస్పిటల్ (బీ) వార్డెన్ యo...
By Sadaq Sadaq 2026-02-09 10:13:11 0 118
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మధుసూదన్ నాయుడు
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో నలుగురు మృతి చెందిన ఘటనపై టీడీపీ నేత మధుసూదన్ నాయుడు ఆదివారం ప్రభుత్వ...
By Kothuru Murali 2026-03-15 10:46:09 0 94
Andhra Pradesh
రాజధాని అమరావతి నుంచి డబ్ల్యూ ఆర్ డి స్పెషల్ సీఎస్ డి. సాయి ప్రసాద్, ఐ.ఏ.ఎస్ గారు , సీసీఎల్‌ఏ చీఫ్ కమిషనర్ జయలక్ష్మి , ఐ.ఏ.ఎస్ గారు  కలిసి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ అంశాలపై వీక్షణ సమావేశం నిర్వహించారు.
రాజధాని అమరావతి నుంచి డబ్ల్యూ ఆర్ డి స్పెషల్ సీఎస్ డి. సాయి ప్రసాద్, ఐ.ఏ.ఎస్ గారు ,...
By Gadiyapudi Narendra 2026-01-07 10:07:30 0 146
Telangana
ఘనంగా హర్ గర్ తిరంగా జెండా కార్యక్రమం.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: అల్వాల్ సర్కిల్ పరిధి  అంబేద్కర్ నగర్ లో  హర్ గర్ తిరంగా...
By Sidhu Maroju 2025-08-14 10:45:19 0 654
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com