ఈనెల 4న పీసీసీ చీఫ్‌ షర్మిల జిల్లా పర్యటన. పర్చూరు,చీరాలలలో ఉపాధి పథకంపై రచ్చబండ విలేకరుల సమావేశంలో పర్యటన వివరాలను వెల్లడించిన కాంగ్రెస్ పార్టీనేతలు.

0
229

చీరాల: ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈనెల 4వ తేదీ బుధవారం  బాపట్ల జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.జిల్లా పార్టీ అధ్యక్షులు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆదేశాలతో సోమవారం వేటపాలెం మండలం కొత్తపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియెజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు  పీసీసీ చీఫ్‌ షర్మిల పర్యటన వివరాలను మీడియాకు వెల్లడించారు.ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈనెల 4 వ తేదీ బుధవారం పర్చూరు నియెజకవర్గం ఇంకొల్లు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి చీరాల నియెజకవర్గంలోని వేటపాలెం మండలం కొత్త పేట గ్రామంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారని స్వష్టం చేశారు.కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారన్నారు.కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు నుంచి మహాత్మగాంధీ పేరు తొలగించి, పథకం పేరు మార్చిన వైనాన్ని ఆమె ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందన్నారు.అనంతరం కాంగ్రెస్‌ నాయకులతో సమావేశమై పార్టీని బలోపేతం చేయడంపై చర్చించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మార్పు గ్రెగొరీ ,ఏపీసీసీ మెంబర్ సయ్యద్ అల్లిం  బాబు, కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరి వాసు ,మాజీ కౌన్సిలర్ మల్లెల బుల్లిబాబు ,షేక్ రెహమాన్ ,మిరియాల శ్రీనివాస్, దేవరపల్లి బాబురావు ,AMC మాజీ డెరెక్టర్ కనపర్తి బజ్జిబాబు ,మేరిగ ఇస్సాక్, మేరిగ రమేష్ ,పులి శంకర్ తదితరాలు పాల్గొన్నారు .

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
పి పి పద్ధతిలో రోడ్లు వేస్తే ప్రైవేట్ రోడ్లు మారుతాయా మెడికల్ కాలేజీలు అంతే
*Press Release*   *పీపీపీ విధానంలోనే ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్నిస్తున్నాం*  ...
By Rajini Kumari 2025-12-17 08:57:47 0 211
SURAKSHA
Hasmukh Patel, IPS: Transforming Policing in Ahmedabad
The Journey Begins "Modern policing is built on trust, technology, and timely...
By Fathima Safa 2026-07-20 11:31:46 0 43
Andhra Pradesh
ముస్లిం... మైనారిటీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది - ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య
కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభివద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉందని చీరాల శాసనసభ్యులు...
By Vadlamudi NagaVenkat 2026-03-21 08:06:30 0 582
Andhra Pradesh
విశాఖ లో లోకా యుక్త శిబిరం
ఈ నెల 29.30 తే ది ల లోకా యుక్త ఉచిత శిబిరం విశాఖలో   నిర్వ హి స్థూన్నా మ నీ  లో కా...
By Mobbu Venkatramana 2026-01-18 14:57:08 0 650
Andhra Pradesh
నిమ్మనపల్లి: ట్రాక్టర్ ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు.
గురువారం నిమ్మనపల్లి మండలంలో ట్రాక్టర్ ప్రమాదంలో ముస్తూరుకు చెందిన రైతు మస్తాన్ తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-06-26 03:15:16 0 75
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com