సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల రజతోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం.
Posted 2026-03-02 13:47:56
0
251
వేటపాలెం: వేటపాలెంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ వేడుకలకు రావాల్సిందిగా బాపట్ల జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ ను కళాశాల బృందం సాదరంగా ఆహ్వానించింది.
సోమవారం జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ వినోద్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కళాశాల ప్రిన్సిపాల్ డా. జగదీష్ ఫిజికల్ డైరెక్టర్ అన్నం శ్రీనివాసరావు, కలెక్టర్ కు పుష్ప గుత్యం అందించి వేడుకలకు సంబంధించిన అధికారిక ఆహ్వాన పత్రికను వారికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. జగదీష్ మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా కళాశాల సాధించిన ప్రగతిని, నాక్ ఏ గ్రేడ్, ఎన్ బి ఏ గుర్తింపు, అటానమస్ హోదాతో విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన సాంకేతిక విద్య గురించి కలెక్టర్ కు వివరించారు. కళాశాల రజతోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Kolkata Port Records Strong Growth in Cargo Handling
The Syama Prasad Mookerjee Port has reported an increase in cargo handling, driven by higher...
అన్నమయ్య: రైతులకు మామిడి కవర్ల పంపిణీ చేసిన జేసీ.
అన్నమయ్య జిల్లాలో సోమవారం రైతులకు రూ. 5.5 కోట్ల విలువైన మామిడి కవర్లను జేసీ శివనారాయణ శర్మ పంపిణీ...
"సీపీ సుమతి బాధ్యతల స్వీకారం… సైబర్ నేరాలు, డ్రగ్స్పై కఠిన చర్యలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్కు నూతన కమిషనర్గా బాధ్యతలు...
14 యేళ్ళు ఉద్యమం నడపాలంటే ఎన్ని ఆర్ధిక వనరులు కావాలి...
ప్రతి మండలానికి ధూమ్ ధాం ప్రోగ్రామ్ చెయ్యాలి అంటే ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది? ...
బాపట్ల పట్టణ శివారు చింతా వారి పాలెం వద్ద వరి కుప్ప దగ్దం గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించి పరారైన వైనం..
బాపట్ల పట్టణ శివారు చింతా వారి పాలెం వద్దవరి కుప్ప దగ్దం... గుర్తు తెలియని వ్యక్తులు...