వికసిత్ భారత్ లక్ష్యంగా వి.బి.జి రామ్ చట్టం–2025 పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
Posted 2026-03-02 13:39:09
0
275
బాపట్లజిల్లా : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన వి.బి.జి రామ్ చట్టం–2025 కు సంబంధించిన అవగాహన పోస్టర్ను బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. వికసిత్ భారత్–2047 దార్శనికతకు అనుగుణంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, జీవనోపాధిని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ చట్టం యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలను సామాన్య ప్రజలకు వివరించేందుకు ఫిబ్రవరి 26, 2026 నుండి మార్చి 24, 2026 వరకు జిల్లావ్యాప్తంగా జన్ సంవాద్ పేరుతో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ప్రజలకు ఈ చట్టం ద్వారా కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధిని పటిష్టం చేస్తూ, పారదర్శకతతో కూడిన అభివృద్ధి పనుల ద్వారా గ్రామాల రూపురేఖలు మార్చడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో ప్రజలు చురుకుగా పాల్గొని, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డ్వామా పిడి ఆళ్ల విజయలక్ష్మి జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు
సూర్యామెహన్ మద్దూర్ మండల్
రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ...
గాంధీభవన్లో మల్కాజిగిరి పార్లమెంట్ సమావేశం – కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి
హైదరాబాద్, మే 30: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు...
అర్హులందరికీ సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి బుధవారం 39వ డివిజన్ నేతాజీ నగర్లో...
రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ అధికారిక యాప్ మై టిడిపిని విస్తృతంగా డౌన్లోడ్ చేయించడం జరిగింది
రాయచోటి నియోజకవర్గం లోని రామాపురం మండలం నీలకంఠరావుపేట గ్రామంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచనల...
శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత : మంచిర్యాల మేయర్
మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు మంచిర్యాల నగర పాలక...