TTD: మార్చి 3న చంద్రగ్రహణం... భక్తులకు టీటీడీ అలర్ట్.

0
181

మార్చి 1, 2 తేదీల్లో స్లాట్ సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేస్తున్నామన్న టీటీడీ

వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలు సహా అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడి

మార్చి 3న రాత్రి 8:30 నుంచి తిరిగి దర్శనాలు ప్రారంభమవుతాయన్న టీటీడీ

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం అందించింది. మార్చి 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నందున, రెండు రోజుల పాటు స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్ల జారీని రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రకారం, మార్చి 1, 2 తేదీల్లో తిరుపతిలోని కౌంటర్లలో ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేయబడవు. 

 

టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 గంటల నుంచి సాయంత్రం 6:47 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఆగమశాస్త్ర నియమాల అనుసరించి, గ్రహణ సమయంలో ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ క్రమంలో మార్చి 3న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంటాయి. ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం తర్వాత రాత్రి 7:30 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. 

 

గ్రహణం కారణంగా మార్చి 3న శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటివాటిని టీటీడీ రద్దు చేసింది. వీటితో పాటు వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. 

 

భక్తులను రాత్రి 8:30 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతిస్తారు. అయితే, మార్చి 4వ తేదీ దర్శనానికి సంబంధించిన ఎస్‌ఎస్‌డీ టోకెన్లను యథావిధిగా మార్చి 3న జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ మార్పులను గమనించి, తమ ప్రయాణాలను అందుకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Search
Categories
Read More
Andhra Pradesh
నిద్రమత్తు ప్రమాదాలకు చెక్.. 'స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో'.
అన్నమయ్య జిల్లా పోలీసులు రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి 'స్టాప్, ఫేస్ వాష్ అండ్...
By Pagadala Venkateswar 2026-06-22 07:02:56 0 70
Telangana
బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోదండం ఎక్కించాలి అంటే కుదరదు...సీఎం రేవంత్ రెడ్డి
‎బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోదండం ఎక్కించాలి అంటే కుదరదు ఈ POCSO...
By Ponnala Srinivasrao 2026-05-16 02:30:12 0 115
Telangana
మెగా రక్తదాన శిభిరం లో పాల్గొన్న ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్ లో మంచిర్యాల క్లబ్ వారి ఆధ్వర్యంలో రెడ్...
By Avunoori Mahesh 2026-07-11 08:54:36 0 133
Telangana
Basara temple renovation
బాసరలోని పవిత్ర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను...
By G k Nookala 2026-04-04 11:32:09 0 201
Telangana
తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీల మార్పు!!!!!!!!!!!!
తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీల మార్పు2026 మార్చి 3న జరగాల్సిన పరీక్ష 4వ తేదీకి మార్పుహోలీ కారణంగా...
By SivaNagendra Annapareddy 2025-12-16 14:18:40 0 250
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com