బాధిత కుటుంబాలతో మాట్లాడి ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు

0
815

వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో గాయపడిన బాధితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి పరామర్శించారు. హోం మంత్రి వంగలపూడి అనితతో కలిసి సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా తెలుసుకున్నారు.

అనంతరం ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలను పరిశీలించిన సీఎం, బాధిత కుటుంబ సభ్యులను కలసి ఓదార్చారు. ఈ విషాద సమయంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే ప్రకటించిన పరిహారాన్ని తక్షణమే అందజేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు సేకరించి సమగ్ర విచారణ జరిపిస్తామని తెలిపారు. బాధితులకు న్యాయం చేయడంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులకు సూచించారు.

ఈ ఘటన రాష్ట్రాన్ని కలచివేసిందని పేర్కొన్న సీఎం, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Telangana
సమస్యల పరిష్కార దిశగా కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి పర్యటన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సాజిద్,...
By Sidhu Maroju 2025-12-21 09:01:07 0 168
Andhra Pradesh
పాలిసెట్‌కు ఉచిత శిక్షణ.. విద్యార్థులకు అవకాశం.
మదనపల్లె జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల, పాలిసెట్–2026 పరీక్షకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు...
By Pagadala Venkateswar 2026-03-27 05:34:28 0 130
Andhra Pradesh
మదనపల్లి: రోడ్డు భద్రతా నియమాలు పాటిద్దాం: ఆర్టీఓ.
మదనపల్లిలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా, ఆర్టీఓ అశోక్ ప్రతాప్‌రావ్ స్థానిక...
By Pagadala Venkateswar 2026-01-23 11:24:40 0 131
Telangana
KTR Formula E race : ఫార్ములా ఈ కేసు, కేటీఆర్‌పై చార్జిషీట్
KTR
By Sunka Santhosh 2026-03-23 19:41:57 0 237
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com