మైలవరం నియోజకవర్గం 41,594 మందికి 18. సున్నా ఏడు కోట్ల పింఛన్లు పంపిణీ

0
160

మైలవరం నియోజకవర్గంలో 41,954 మందికి రూ.18.07 కోట్ల పింఛన్లు.

 

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

 

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేత.

 

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 28.02.2026.

 

ఎన్టీఆర్ భరోసా పథకం కింద మైలవరం నియోజకవర్గంలో 41,954 మందికి రూ.18.07 కోట్ల పింఛన్ల సొమ్మును ఈ నెల పంపిణీ చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు.

 

ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు, కూటమి నేతలు శనివారం లబ్ధిదారులకు అందజేశారు.

 

రెడ్డిగూడెం మండలంలో 7,125 మందికి రూ.3,03,84,000లు, 

మైలవరం మండలంలోని 9471 మందికి రూ.4,07,96,000లు,

విజయవాడ రూరల్ మండలంలోని 6,957 మందికి రూ.3,02,93,500లు, 

జి.కొండూరు మండలంలోని 8,472 మందికి రూ.3,61,65,000లు, 

ఇబ్రహీంపట్నం మండలంలోని 4,719 మందికి రూ.2,02,16,500లు, 

కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5,210 మందికి రూ.2,28,52,000లు మంజూరయ్యాయి.

 

మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా 51 మందికి స్పౌజ్ కేటగిరి కింద మార్చి నెలకు నూతన పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెంచిన సామాజిక భద్రత పింఛన్లు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారుల తరపున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Disaster Management and Relief
During natural disasters like floods, the Karnataka Police consistently stands at the forefront...
By Kalaga Sailaja 2026-06-29 10:26:53 0 82
Andhra Pradesh
ఇకపై 24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.
  ఇకపై 24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు Andhra Chandrababu...
By Pagadala Venkateswar 2026-05-05 06:37:59 0 131
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం
పత్రికాప్రకటన, ఇంద్రకీలాద్రి, విజయవాడ, 26 Dec, 2025 –          ...
By Rajini Kumari 2025-12-26 10:04:50 0 220
Andhra Pradesh
సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపీ కేసినేని శివనాథ్
*ప్ర‌చుర‌ణార్థం* *18-12-2025*   సీఎం చంద్ర‌బాబు కు స్వాగ‌తం...
By Rajini Kumari 2025-12-19 10:08:02 0 204
International
The Beijing Bet: Trump’s Billionaire Tech Summit
 In May 2026, President Trump’s visit to Beijing—flanked by titans like Elon...
By Hazu MD. 2026-05-15 13:18:15 0 232
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com