పేదలకు ఆసరా ఉండేలా సంక్షేమ పథకాలు సీఎం చంద్రబాబు

0
131

* పేదలకు ఆసరా ఉండాలనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం.

* ప్రతీ నెలా 1 తేదీనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందిస్తున్నాం.

* 67 లక్షల మందికి ఏడాదికి 33 వేల కోట్ల ను వ్యయం చేసి పెన్షన్ అందిస్తు్న్నాం

* గతంలో ఒక్క నెల పెన్షన్ తీసుకోకపోయినా తీసేశారు. ఇప్పుడు మూడు నెలలది ఒకేసారి తీసుకునేలా వెసులుబాటు ఇచ్చాం

* గత పాలనలో రౌడీయిజం పరాకాష్టకు చేరింది. 

* అకారణంగా నన్ను జైల్లో పెట్టారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి

* వాళ్లు అరెస్టు చేసి జైల్లో పెట్టినా నేను కుంగిపోలేదు. ప్రజా పోరాటంలో ఎక్కడా అలసి పోలేదు

* రాష్ట్రాన్ని బాగుచేయడానికే పవన్ కల్యాణ్, బీజేపీలతో కలిసి కూటమిగా ఏర్పడి సుపరిపాలన అందిస్తు్న్నాం

* ప్రజలు ఇచ్చిన నిర్ణయంతోనే వెంటిలేటర్ పై ఉన్న ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాం. 

* గూగు్, టీసీఎస్, కాగ్నిజెంట్, లాంటి సంస్థలు ఉత్తరాంధ్రకు వస్తున్నాయి. 

* భోగాపురం విమానాశ్రయం కూడా విజయనగరంలో పూర్తి కావొస్తోంది

* ఉమ్మడి 3 జిల్లాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. 

* గిరిజన యూనివర్సిటీని కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. 

* ఉత్తరాంధ్రలోని తీర ప్రాంతంలో అరుదైన ఖనిజాలు కూడా ఉన్నాయి. 

* ఫ్యాక్టరీలు వస్తే మన దగ్గరే యువతకు ఉద్యోగాలు వస్తాయి

* గత ప్రభుత్వంలో భూ రికార్డులు తారుమారు చేశారు. 

* అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రీసర్వే చేస్తున్నాం

* క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్ల తో పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నాం

* 2019-24 మధ్య తిరుమల లడ్డూలకు, ఇప్పటి తిరుమల లడ్డూలకు తేడా గమనించారా.?

* దేవుడి పవిత్రను దెబ్బతీయడానికి గత పాలకులు ప్రయత్నించారు.

* కెమికల్ తో నెయ్యి తయారు చేసి దేవుడికి నైవేద్యం పెట్టారంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో అర్ధ చేసుకోవాలి

* చేసిన తప్పును ఎదుటి వారిపై వేసి తప్పించుకోవాలని చూశారు. అందుకే దీనిని ప్రస్తావించాల్సి వస్తోంది.

* ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీకి రారు. 10శాతం సీట్లు కూడా రాకుండా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది

* ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటున్నారు. అడ్డదారుల్లో మాట్లాడటంతో పాటు దౌర్జన్యం చేస్తున్నారు.

* రాష్ట్రంలో రౌడీలకు చోటు లేదు. గంజాయి బ్యాచ్ ను కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నా

*సీఎం చంద్రబాబు*

Search
Categories
Read More
Telangana
బంగారు బాబు గుట్టురట్టు.. ఒంటి నిండా రోల్డ్ గోల్డ్!
ఒంటి నిండా భారీ బంగారు ఆభరణాలతో జిగేల్‌మని మెరిసే గోల్డ్‌ మ్యాన్‌పై ఐటీ అధికారుల...
By Ponnala Srinivasrao 2026-03-30 11:27:47 0 110
Telangana
రాఖీ పౌర్ణమి సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి రాఖీ కట్టిన మహిళలు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్...
By Sidhu Maroju 2025-08-09 17:03:18 0 725
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:నా వద్ద అన్ని ప్రూఫ్ లు ఉన్నాయి.. బీపీఎం
తన వద్ద తపాలా శాఖకు చెందిన కొందరు అధికారులు నగదు తీసుకున్నారని, వాటికి రశీదులు ఇస్తామని తనను మోసం...
By Kothuru Murali 2026-02-24 11:08:13 0 83
Andhra Pradesh
పులిచెర్ల: ఊపిరి పీల్చుకున్న రైతులు
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న జంట ఏనుగులు శుక్రవారం పాకాల మండలంలోని...
By Kothuru Murali 2026-01-31 04:28:10 0 104
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com