మారుమూల పల్లె నుంచి మైదానం వరకు...జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైన గిరిజన యువతి!

0
401

​ మహబూబాబాద్/గంగారం, ఫిబ్రవరి 27 (భారత్ ఆవాజ్):  అకుంఠిత దీక్ష, పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది గంగారం మండలంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన యువతి. గంగారం మండల కేంద్రానికి అత్యంత దూరంలో ఉన్న తిరుమలగండి గ్రామానికి చెందిన తాటి కృష్ణవేణి, తన ప్రతిభతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) జట్టులో చోటు సంపాదించి, జాతీయ స్థాయి BCCI వన్డే మహిళా టోర్నీకి ఎంపికైంది.

​*మంత్రి సీతక్క ప్రోత్సాహం*

​కృష్ణవేణి ప్రతిభను గుర్తించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఆమెకు వెన్నుదన్నుగా నిలిచారు. మంత్రి ఆదేశాల మేరకు గంగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాడి వెంకటేశ్వర్లు బుధవారం కృష్ణవేణిని కలిసి ఘనంగా సత్కరించారు. మంత్రి సీతక్క తరపున కృష్ణవేణికి తక్షణ సాయంగా 10,000 రూపాయల నగదును అందజేశారు. భవిష్యత్తులో కృష్ణవేణికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను మంత్రి అందిస్తారని వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. జాతీయ స్థాయిలో రాణించి, త్వరలోనే భారత ఇంటర్నేషనల్ క్రికెట్ జట్టులో కూడా చోటు సంపాదించాలని నాయకులు ఆకాంక్షించారు. ​"అడవిలో వికసించిన ఆణిముత్యంలా కృష్ణవేణి తన ప్రతిభను చాటుకుంది. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని జాడి వెంకటేశ్వర్లు అన్నారు.​ఈ కార్యక్రమంలో కోమట్లగూడెం సర్పంచ్ గుంట రామారావుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం సమ్మయ్య, కంగాల శీను, వెంకన్న, మోహన్ రావు, అశోక్, సురేష్, బాలకృష్ణ, పల్లె సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Retired Police Officer 's wellfare Association. Vijayawada , Gandhinagar.
రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయవాడ అధ్వర్యంలో ఈరోజు ఉదయం గాంధీనగర్ లోని...
By Kokkiligadda Suresh 2026-04-14 08:52:53 0 246
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ :పుంగనూరు నియోజకవర్గం: మండలంలో అగ్నిప్రమాదం
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కోటూరు గ్రామంలో మంగళవారం దొరస్వామి అనే రైతుకు చెందిన...
By Kothuru Murali 2026-02-18 07:27:04 0 157
Andhra Pradesh
సీఎం చంద్రబాబుతో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ.. కీలక సమస్యలపై వినతి.
  సీఎం చంద్రబాబుతో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ.. కీలక సమస్యలపై వినతి 09-04-2026 Thu 07:50 |...
By Pagadala Venkateswar 2026-04-09 04:44:24 0 104
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : వీబీజీ-రామ్ పథకంపై ఈనెల 9న అవగాహన
సదుం ఎంపీడీవో రాధారాణి మాట్లాడుతూ, ఈనెల 9న వీబీజీ-రామ్ పథకంపై ప్రత్యేక అవగాహన సమావేశం ఏర్పాటు...
By Kothuru Murali 2026-03-08 08:18:15 0 111
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com