గాంధీ ఐవిఎఫ్ విజయం: పేదరికానికి అందని మాతృత్వం..ఇప్పుడు ప్రభుత్వంతో సాధ్యం.|

2
221

 

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగంలో మరో అద్భుత మైలురాయి నమోదైంది. 

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఉచిత సంతాన సాఫల్య కేంద్రం (IVF Centre) ద్వారా తొలి శిశువు జన్మించింది.

అల్వాల్‌కు చెందిన ఓ మహిళ ఈ అత్యాధునిక చికిత్స ద్వారా మాతృత్వాన్ని పొంది, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

అల్వాల్‌కు చెందిన విజయ (పేరు మార్చాం) (30) అనే మహిళకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. సంతానం కోసం గతంలో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. చివరకు గాంధీ ఆసుపత్రిలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఐవీఎఫ్ సేవల గురించి తెలుసుకున్న ఆ దంపతులు 2024 అక్టోబర్‌లో ఇక్కడి సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించారు.

 

వైద్యులు ఆమెకు అవసరమైన పరీక్షలు నిర్వహించి, ఐవీఎఫ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ నెల ఫిబ్రవరి 7వ తేదీన ఎమర్జెన్సీ సిజేరియన్ ద్వారా ఆమె 2 కిలోల బరువున్న ఆడశిశువుకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండటంతో ఫిబ్రవరి 25న వారిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.

 

ఈ అద్భుత విజయంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. గాంధీ ఐవీఎఫ్ బృందంలోని డాక్టర్ శోభ, డాక్టర్ సుమిత్ర నాయర్, డాక్టర్ ఫాతిమా రాణి తదితరులను ఆయన అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. 

 

ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. 5 నుండి 10 లక్షల వరకు ఖర్చయ్యే ఈ చికిత్సను పేదలకు ఉచితంగా అందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం గాంధీ మరియు పేట్లబురుజు ఆసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉండగా, త్వరలోనే వరంగల్ మరియు ఆదిలాబాద్‌లకు కూడా వీటిని విస్తరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

మాతృత్వం పొందలేని మహిళలకు ఇది ఒక వరమని  ఆసుపత్రి సేవలను అందరూ ప్రశంసిస్తున్నారు 

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
​ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భిణీ మృతి: కుటుంబీకుల ఆందోళన.
మదనపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరిన గాయత్రి అనే గర్భిణీ మృతి చెందడంతో ఉద్రిక్తత...
By Pagadala Venkateswar 2026-03-08 04:46:00 0 84
Telangana
తెలంగాణలో పెరిగిన ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణలో పెరిగిన ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ తెలంగాణలో మార్చి రెండో వారంలోనే ఉష్ణోగ్రతలు 40...
By Pinnehasan Odela 2026-03-06 06:38:45 0 119
Life Style
Wellness & Sustainable Living
Wellness & Sustainable Living Charu Asopa Leads the Way in Eco-Friendly Living with Solar...
By BMA ADMIN 2025-05-23 09:34:58 0 2K
Andhra Pradesh
మదనపల్లె పార్టీ కార్యాలయంలో కాన్షీరామ్ జయంతి వేడుకలు.
మదనపల్లె పార్టీ కార్యాలయంలో ఆదివారం బహుజన రాజ్యాధికార స్థాపకుడు కాన్షీరామ్ జయంతి వేడుకలు ఘనంగా...
By Pagadala Venkateswar 2026-03-16 02:09:34 0 91
Andhra Pradesh
రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
రధ సప్తమి సందర్బంగా సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేసిన మాజి మంత్రివర్యులు వెలంపల్లి...
By Rajini Kumari 2026-01-25 11:06:03 0 131
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com