Somu Veerraju: శాసనమండలిలో సోము వీర్రాజుపైకి దూసుకెళ్లిన వైసీపీ సభ్యులు... సభ రేపటికి వాయిదా.

0
143

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ సందర్భంగా సభలో గందరగోళం

చర్చ అనంతరం మరో ప్రశ్నపై మాట్లాడేందుకు సిద్ధమైన సోము వీర్రాజు

వీర్రాజుపై దాడికి యత్నించిన వైసీపీ సభ్యులు

 

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఈరోజు రణరంగాన్ని తలపించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య చెలరేగిన వివాదం చివరకు తోపులాట వరకు వెళ్లడంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ముగిసిన తర్వాత, ఈ అంశంపై మరింత చర్చ జరపాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టడంతో గందరగోళం మొదలైంది. అయితే, మంత్రి వివరణ పూర్తయిందని స్పష్టం చేసిన మండలి ఛైర్మన్ మోషేనురాజు... తదుపరి ప్రశ్నకు అవకాశం కల్పించారు. ఈ తరుణంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడేందుకు ప్రయత్నించగా... వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు.

 

 

తమ నిరసన కొనసాగుతుండగానే సోము వీర్రాజుకు మైక్ ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ తదితరులు ఒక్కసారిగా వీర్రాజు సీటు వైపు దూసుకెళ్లారు. కేవలం వాగ్వాదానికే పరిమితం కాకుండా, ఆయనపై దాడికి యత్నించడంతో సభలో కలకలం రేగింది. పరిస్థితి విషమిస్తుండటంతో అప్రమత్తమైన మంత్రులు అనిత, గొట్టిపాటి రవికుమార్ వెంటనే సోము వీర్రాజుకు అండగా నిలబడి, వైసీపీ సభ్యులను అడ్డుకున్నారు. ఇరుపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరగడం, సభ్యులు ఒకరిపై ఒకరు దూసుకురావడంతో సభ నియంత్రణ తప్పింది. ఈ క్రమంలో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఛైర్మన్ మోషేనురాజు సభను రేపటికి వాయిదా వేశారు.

Search
Categories
Read More
Telangana
"30 వేల లంచం.. ఏసీబీకి దొరికిపోయిన లేడీ ఎస్సై!"
హైదరాబాద్ : సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో బుధవారం సాయంత్రం...
By Sidhu Maroju 2026-05-21 07:15:44 0 340
Telangana
శాశ్వత నీటి పరిష్కారం మినీ ట్యాంక్ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదర్ పల్లి గ్రామంలోని 2వ వార్డ్ లో వాటర్ సమస్యని గుర్తించిన...
By MERIGE MALLESH 2026-03-27 10:52:23 0 310
Telangana
ప్రతి పేదవాడి సొంత ఇంటి కలలను నెరవేర్చడమే నా లక్ష్యం: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతి పేదవాని సొంత ఇంటి కలలను నెరవేర్చడమే తన లక్ష్యమని...
By Sidhu Maroju 2025-06-12 12:22:54 0 1K
Andhra Pradesh
పుంగనూరులో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభం
అన్నమయ్య జిల్లా పుంగనూరులో శుక్రవారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని కూటమి నాయకులు...
By Kothuru Murali 2026-03-14 08:24:39 0 155
Tamilnadu
Tamil Nadu Observes National Electricity Safety Week
The Tamil Nadu Electricity Department is currently observing "National Electricity Safety Week...
By Lokeshwari Panthadi 2026-07-01 04:46:13 0 68
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com