జూలై 1న జాతీయ కార్మిక సంఘాల సంయుక్త నిరసన కార్యక్రమాలు

0
174

గోదావరిఖని : కోల్ ఇండియా స్థాయిలో నాలుగు జాతీయ కార్మిక సంఘాల ఫెడరేషన్లు సంయుక్తంగా సమావేశమై JBCCI-12వ వేతన ఒప్పందం ఏర్పాటు మరియు కార్మికుల సమస్యలపై కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో, సింగరేణిలో ఆయా ఫెడరేషన్లకు చెందిన INTUC, AITUC, CITU, HMS సంఘాల నాయకులు సంయుక్త కార్యాచరణ కమిటీ (JAC)గా ఏర్పడి జూలై 1న నిర్వహించనున్న కార్యక్రమాలపై గోదావరిఖనిలో కార్యాచరణ సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు,ఈ సమావేశంలో INTUC నుండి డా. బి. జనక్ ప్రసాద్, నరసింహారెడ్డి, ధర్మపురి, AITUC నుండి వాసిరెడ్డి సీతారామయ్య, మడ్డి ఎల్లయ్య, CITU నుండి రాజిరెడ్డి, రాజమౌళి, HMS నుండి సారయ్య, అనిల్ రెడ్డి పాల్గొన్నారు,ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించే విధంగా నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేయాలని ప్రయత్నిస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మిక వ్యతిరేకమైన ఈ నాలుగు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు,అలాగే బొగ్గు పరిశ్రమ కార్మికులకు అత్యంత కీలకమైన JBCCI-12వ వేతన ఒప్పందం ప్రక్రియను లేబర్ కోడ్‌ల పేరుతో జాప్యం చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మరియు కోల్ ఇండియా యాజమాన్యం వెంటనే JBCCI-12వ వేతన ఒప్పందానికి సంబంధించిన చర్చలు ప్రారంభించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు,సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు మరియు JBCCI-12వ వేతన ఒప్పందం తక్షణ ప్రారంభం కోసం జూలై 1న సంయుక్తంగా భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

జూన్ 29,శ్రీరాంపూర్ – గేట్ మీటింగ్, విలేకరుల సమావేశం భూపాలపల్లి – గేట్ మీటింగ్, విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు,

జూన్ 30,కొత్తగూడెం – గేట్ మీటింగ్, విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు,

జూలై 1,కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్ద భారీ నిరసన కార్యక్రమం,అనంతరం విలేకరుల సమావేశంలో,జేఏసీ నాయకులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Uttarkhand
Uttarakhand Goes Green: Cabinet Mandates "No Vehicle Day"
In a bold move to combat the global energy crisis, Chief Minister Pushkar Singh Dhami’s...
By Dunna Jessicaruth 2026-05-14 09:01:52 0 143
Business & Finance
ESI Registration Secures Employee Health Benefits
ESI (Employees' State Insurance) Registration is a mandatory compliance for eligible businesses...
By Navya Sree 2026-07-10 06:59:20 0 66
Andhra Pradesh
సిసిటివి కెమెరాలన్నీ సక్రమంగా పని చేయాలి.
గుంటూరు, జనవరి 22:రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 14,000 సిసిటివి కెమెరాలన్నీ నిరంతరం సక్రమంగా...
By John Baji 2026-01-22 13:40:29 0 222
Odisha
Odisha Crackdown: New Strict SOPs for De-Addiction Centres
Following a troubling series of reported safety failures and untimely patient deaths at various...
By Lokeshwari Panthadi 2026-06-26 06:33:28 0 33
Telangana
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారు....
  ఈరోజు నెక్కొండ మండలం గొట్లకొండ తండా లో మొట్టమొదటగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని...
By Gujile Ramu 2026-04-26 09:40:43 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com