చీరాలలో ఘనంగా ప్రింటర్స్ డే వేడుకలు

0
149

చీరాల:  ముద్రణ రంగంలో వస్తున్న ఆధునిక టెక్నాలజీని వినియోగించుకొని ముద్రణ రంగంలో వృద్దిలోకి రావాలని పలువురు సీనియర్ ప్రింటింగ్ రంగ ప్రతినిధులు పేర్కొన్నారు. ముద్రణ యంత్రం రూపొందించిన జోహాన్ఎస్ గూటెన్ బర్గ్ జయంతి సందర్బంగా ప్రింటర్స్ వేడుకలు మంగళవారం నిర్వహించారు.  ముందుగా జెండా ఆవిష్కరణ చేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రముఖుల విగ్రహాలుకు పూల మాలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రోటరీ కమ్యూనిటీ హాలులో సభను నిర్వహించడం జరిగింది. ముద్రణ రంగంలో పని చేసి మరణించిన పలువురికి నివాళులు అర్పించారు. ముద్రణ రంగంలో వస్తున్న ఆధునిక టెక్నాలజీ ని అంది పుచ్చుకొని ఆర్ధికంగా ఎదగాలన్నారు. ముద్రణ రంగం పై ఎంతో మంది ఆధార పడి ఉపాధి పొందుతున్నారని అన్నారు. అక్షరం పేర్చే స్థాయి నుంచి ఏఐ స్థాయి వరకు ప్రింటింగ్ రంగం పెరిగిందన్నారు. అందరు ఐక్యత గా ఉండి ప్రింటింగ్ రంగాన్ని అభివృద్ధికి పాటుపడాలాన్నారు. అనంతరం శివ శంకర్ ఆఫ్సెట్ ప్రింటర్స్ అధినేత అచ్చుల నాగేశ్వరావు ను ఘనంగా సత్కరించుకున్నారు. లక్కీ డిప్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో అధ్యక్షులు నక్కల శ్రీనివాసరావు, కార్యదర్శి అరవింద్, కోశాధికారి కొణిజేటి నాగేశ్వరరావు, ప్రింటింగ్ ప్రెస్, బైండర్స్, ఫ్లెక్స్ ప్రింట్రర్స్, డీటీపీ ఆపరేటర్స్ తదితరులు ఎంతో ఉత్సహంగా పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: భూ వివాదంపై సబ్ కలెక్టరేట్ ఎదుట గిరిజన రైతుల ధర్నా.
మదనపల్లి నక్కలదిన్నె తండాకు చెందిన 39 మంది గిరిజన రైతులు సోమవారం మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఎదుట...
By Pagadala Venkateswar 2026-02-24 07:17:13 0 119
Andhra Pradesh
మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో మరో నిందితుడు అరెస్ట్: డీఎస్పీ.
మదనపల్లిలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు....
By Pagadala Venkateswar 2026-02-15 05:47:35 0 135
Andhra Pradesh
నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం
*Photos :-* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గం,...
By Rajini Kumari 2026-03-10 08:49:50 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com