పదవ తరగతి ప్రతిభావంతులకు నగదు పురస్కారం - ఎన్.ఆర్. అండ్ పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ వెల్లడి

0
68

చీరాల 

చీరాల, వేటపాలెం మండలాల్లోని పదవ తరగతి ఫలితాల్లో పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికం అందజేయనున్నట్లు ఎన్.ఆర్.అండ్ పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్.ఆర్.అండ్ పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ మరియు దోగుపర్తి వెంకట సురేష్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ (శుక్రవారం) ఉదయం 8:00 గంటలకు స్థానిక మునిసిపల్ ఓపెన్ థియేటర్లో ఈ సన్మాన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ఎం.ఎం. కొండయ్య హాజరై, విద్యార్థులకు పురస్కారాలను అందజేయనున్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు దోగుపర్తి వెంకట సురేష్, పోలుదాసు రామకృష్ణ చారగుళ్ళ గురుప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులలోని ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. చీరాల, వేటపాలెం మండలాల్లోని అన్ని పాఠశాలల నుంచి స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులు 9866137914 అనే ఫోన్ నంబర్‌కు సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని వారు కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆకతాయిల ఆటకట్టిస్తాం.. డ్రోన్ కెమెరాల నిఘాలో విద్యాసంస్థలు
అన్నమయ్య జిల్లా పోలీసులు విద్యార్థినుల భద్రతను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక...
By Pagadala Venkateswar 2026-01-04 07:16:29 0 207
Andhra Pradesh
పుంగనూరు ఈసీఎల్ కంపెనీ వద్ద స్థానికుల నిరసన
పుంగనూరు మండలంలోని ఈసీఎల్ పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని స్థానికులు శనివారం...
By Kothuru Murali 2026-01-17 12:31:46 0 123
Telangana
తెలంగాణ : రేపటి నుంచి RTC బంద్..!
తెలంగాణ : RTC నీ ప్రభుత్వంలో విలీనం  చేయాలని, ఈరోజు అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు...
By Sunka Santhosh 2026-04-21 09:19:04 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com