ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు

0
216

కొత్త ఆరోగ్య, ప్రమాద బీమా పథకాలకు కేబినెట్ ఆమోదం

 

60 ఏళ్లలోపు ఉద్యోగి సహజ మరణానికి రూ.10 లక్షల అదనపు సాయం

 

క్యాష్‌లెస్ వైద్యం కోసం డిజిటల్ హెల్త్ కార్డుల జారీ

 

జీతంలో 1.5 శాతం కంట్రిబ్యూషన్‌తో కొత్త హెల్త్ స్కీమ్ అమలు

 

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి కోసం రెండు కీలకమైన సంక్షేమ పథకాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం, ఈ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు. 

 

కొత్తగా ప్రవేశపెట్టనున్న పథకం ప్రకారం, 60 ఏళ్లలోపు సర్వీసులో ఉన్న ఉద్యోగి సహజంగా మరణిస్తే, వారికి అందే రెగ్యులర్ ప్రయోజనాలతో పాటు అదనంగా రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ అందించనున్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే కోటి రూపాయలకు పైగా పరిహారం ఇచ్చేలా మరో పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ బీమా పథకాలకు ఉద్యోగుల నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

దీంతో పాటు, ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయిన క్యాష్‌లెస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్‌ (EHS)కు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీని కింద ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 17 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కోసం ఉద్యోగులు తమ మూల వేతనం నుంచి 1.5 శాతం చెల్లించనుండగా, అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. ఈ నిధులతో ఏర్పాటు చేసే ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలోని 652 ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందిస్తారు. లబ్ధిదారులందరికీ డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నిర్ణయాలతో సుమారు 7.56 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె డీఎస్పీగా బి. పావని బాధ్యతలు స్వీకారం.
మదనపల్లె పోలీస్ సబ్‌డివిజన్ నూతన డీఎస్పీగా బి. పావని సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2023...
By Pagadala Venkateswar 2026-04-13 12:38:31 0 192
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: పిచ్చికుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో సోమవారం చెరుకువారిపల్లి గ్రామానికి చెందిన 13 ఏళ్ల మస్తాన్ అనే...
By Kothuru Murali 2026-03-31 05:16:56 0 206
Telangana
కరీంనగర్ బస్టాండ్ ఏరియాలో శ్రీ చైతన్య స్పోర్ట్స్ డిఫెన్స్అకాడమీ, యంగ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రపంచ మాదకద్రవ్యాలవ్యతిరేక దినోత్సవ ర్యాలీ.
కరీంనగర్ న్యూస్ అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాంటీ డ్రగ్స్ అవగాహన...
By Thalakokkula Sadanandam 2026-06-26 05:24:05 0 143
Andhra Pradesh
పుంగనూరులో ఇలాంటి అలంకరణ చాలా అరుదు కొత్తూరు మురళి
పుంగనూరు పట్టణ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ విరుపాక్షి మారమ్మ గంగజాతర సందర్భంగా మంగళవారం ప్రత్యేక...
By Kothuru Murali 2026-03-10 15:45:27 0 156
Andhra Pradesh
మద్దిలేటి స్వామిని దర్శించుకున్న డోన్ ఎమ్మెల్యే!! కోట్ల
కర్నూలు : బేతంచర్ల : RS రంగాపురం : డోన్:  ముక్కోటి ఏకాదశి మహోత్సవాలను పురస్కరించుకొని...
By Hari Krishna 2025-12-28 08:58:05 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com