ఏపీ బడ్జెట్ సమావేశంలో చేనేత జౌళి శాఖ మంత్రి సవిత స్పందన

0
123

*ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు, నేతన్నల అభివృద్ధికి తీసుకున్న చర్యలపై చీరాల ఎమ్మెల్యే మద్దూలూరి మాలకొండయ్య అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత కింది విధంగా స్పందించారు...*

 

* చీరాల చేనేత క్లస్టర్ కు ఎన్.ఆర్.ఎల్.ఎం కింద రూ.4.17 కోట్లు మంజూరు చేయడం జరిగింది.

* ఆప్కో, చేనేత సంఘాలు విక్రయించిన వస్త్రాలకు జీఎస్టీ మినహాయింపు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం

* చేనేత సంక్షేమానికి త్రిఫ్ట్ పథకం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు నగదు పరపతి పథకాలు అమలు చేస్తున్నాం. త్వరలో నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం కూడా అమలు చేయబోతున్నాం..

* జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం(ఎన్.హెచ్.డి.పి)లో భాగంగా ధర్మవరంలో రూ.38.31 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు నిర్ణయించడమైనది

* పిఠాపురంలో రూ.12 కోట్లు, మంగళగిరిలో రూ.22.35 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదించాం...

* రాష్ట్రంలో చిన్న క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం(ఎస్.సి.డి.పి)లో భాగంగా రూ.10.44 కోట్లతో పది క్లస్టర్లు మంజూరు చేశాం..

* సహాయక క్లస్టర్లతో పాటు ఇతలర క్లస్టర్లకు ఆర్థిక సాయం చేస్తున్నాం..

* ముడి పదార్థాల సరఫరా పథకం, నేత కార్మికులకు ముద్రా పథకం అమలు చేస్తున్నాం

* చేనేత వస్త్రాల అమ్మకం పెంచేలా ఎగ్జిబిషన్లు, చేనేత బజార్లు ఏర్పాటుచేస్తున్నాం..

* గత ప్రభుత్వం చిన్న సంస్థ అయిన ఆప్కోను కూడా విడిచిపెట్టలేదు...

* ఆప్కో పేరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన రూ.120 కోట్లు పక్కదారి పట్టించడం వల్ల ఆ సంస్థలో దారుణమైన పరిస్థితి నెలకొంది..

* ఇప్పుడిప్పుడే ఆప్కోను గాడిలో పెడుతూ, చేనేత సహకార సంఘాల బకాయిలు చెల్లిస్తూ వస్తున్నాం

* యూనివర్సల్ హెల్త్ పాలసీలో భాగంగా చేనేతల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యమిస్తున్నాం...

* చేనేతలకు 2014-19 స్వర్ణయుగం

* కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత మరోసారి చేనేత రంగానికి ప్రాధాన్యమిస్తున్నాం

* చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నాం

* కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆప్కో షో రూమ్ ల్లో అమ్మకాలు పెరిగాయి...

* నేతన్నలకు చేనేత వస్త్రాల తయారీలో స్కిల్ పెంచేలా శిక్షణా కేంద్రాలు నిర్వహిస్తున్నాం .. 

* ఎక్కడికక్కడ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం...

* చేనేతల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది...

Search
Categories
Read More
Andhra Pradesh
రామాపురం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం రామాపురం మండలంలో నూతనంగా నిర్మించిన తెలుగుదేశం...
By Benguluri Madhubabu 2026-03-16 13:04:57 0 142
Andhra Pradesh
పుంగనూరు: బలమైన నాయకులను జైల్లో పెడుతున్నారు: ఎంపీ
తెలుగుదేశం పార్టీ తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టి ఆనందం పొందుతోందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి...
By Kothuru Murali 2026-03-17 07:03:36 0 89
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:బూరగమందలో ఘనంగా సీతారాముల కళ్యాణం, భజనలతో అలరించిన భక్తులు
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలోని బూరగమంద పంచాయతీ మొరం మీద పల్లెలో శ్రీరామనవమి...
By Kothuru Murali 2026-03-28 06:16:29 0 81
Telangana
ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  దుండిగల్  అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని...
By Sidhu Maroju 2025-11-28 05:58:19 0 143
Andhra Pradesh
T.D.P Press Meet On Rob #Guntur New Updates
రైల్వే ఓవర్ బ్రిడ్జి గురించి ఈ రోజు జరిగిన pressmeet    #Sivanagendra #tdppressmeet...
By SivaNagendra Annapareddy 2025-12-14 08:58:59 0 357
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com