ఏపీ బడ్జెట్ సమావేశంలో చేనేత జౌళి శాఖ మంత్రి సవిత స్పందన

0
152

*ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు, నేతన్నల అభివృద్ధికి తీసుకున్న చర్యలపై చీరాల ఎమ్మెల్యే మద్దూలూరి మాలకొండయ్య అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత కింది విధంగా స్పందించారు...*

 

* చీరాల చేనేత క్లస్టర్ కు ఎన్.ఆర్.ఎల్.ఎం కింద రూ.4.17 కోట్లు మంజూరు చేయడం జరిగింది.

* ఆప్కో, చేనేత సంఘాలు విక్రయించిన వస్త్రాలకు జీఎస్టీ మినహాయింపు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం

* చేనేత సంక్షేమానికి త్రిఫ్ట్ పథకం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు నగదు పరపతి పథకాలు అమలు చేస్తున్నాం. త్వరలో నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం కూడా అమలు చేయబోతున్నాం..

* జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం(ఎన్.హెచ్.డి.పి)లో భాగంగా ధర్మవరంలో రూ.38.31 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు నిర్ణయించడమైనది

* పిఠాపురంలో రూ.12 కోట్లు, మంగళగిరిలో రూ.22.35 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదించాం...

* రాష్ట్రంలో చిన్న క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం(ఎస్.సి.డి.పి)లో భాగంగా రూ.10.44 కోట్లతో పది క్లస్టర్లు మంజూరు చేశాం..

* సహాయక క్లస్టర్లతో పాటు ఇతలర క్లస్టర్లకు ఆర్థిక సాయం చేస్తున్నాం..

* ముడి పదార్థాల సరఫరా పథకం, నేత కార్మికులకు ముద్రా పథకం అమలు చేస్తున్నాం

* చేనేత వస్త్రాల అమ్మకం పెంచేలా ఎగ్జిబిషన్లు, చేనేత బజార్లు ఏర్పాటుచేస్తున్నాం..

* గత ప్రభుత్వం చిన్న సంస్థ అయిన ఆప్కోను కూడా విడిచిపెట్టలేదు...

* ఆప్కో పేరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన రూ.120 కోట్లు పక్కదారి పట్టించడం వల్ల ఆ సంస్థలో దారుణమైన పరిస్థితి నెలకొంది..

* ఇప్పుడిప్పుడే ఆప్కోను గాడిలో పెడుతూ, చేనేత సహకార సంఘాల బకాయిలు చెల్లిస్తూ వస్తున్నాం

* యూనివర్సల్ హెల్త్ పాలసీలో భాగంగా చేనేతల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యమిస్తున్నాం...

* చేనేతలకు 2014-19 స్వర్ణయుగం

* కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత మరోసారి చేనేత రంగానికి ప్రాధాన్యమిస్తున్నాం

* చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నాం

* కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆప్కో షో రూమ్ ల్లో అమ్మకాలు పెరిగాయి...

* నేతన్నలకు చేనేత వస్త్రాల తయారీలో స్కిల్ పెంచేలా శిక్షణా కేంద్రాలు నిర్వహిస్తున్నాం .. 

* ఎక్కడికక్కడ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం...

* చేనేతల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది...

Search
Categories
Read More
Bharat Aawaz
మీడియా మూగబోయిందా?🌟ప్రశ్నించని వ్యవస్థ. కలం గళం ఎటువైపు?
మీడియా అంటే ప్రజల గొంతు,  బాధను వినిపించే వేదిక,  ప్రశ్నించే ధైర్యం. సామాన్యుడి సమస్య...
By Hazu MD. 2025-08-21 04:20:52 0 1K
Andhra Pradesh
బండ్లపెంట దివానే సాహెబ్ దర్గా ఉరుసు సుగువాసు ప్రసాద్ బాబు గారిని ఆహ్వానం అందించిన కమిటీ సభ్యులు
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్నం బండ్లపెంటలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ యాసో కదిరి కుతుబ్...
By Benguluri Madhubabu 2026-04-24 08:00:03 0 135
Andhra Pradesh
శ్రీకాకుళం విద్యార్ధులు ఈ ప్రయాణం ప్రమాదం
శ్రీకాకుళం - పొందూరు మద్య తిరిగే బస్సులు తక్కువ అవ్వడం వల్ల విద్యార్ధులు మరియూ ప్రయాణీకులు చాల...
By Manda Ramkumar 2026-03-26 06:54:24 0 153
Andhra Pradesh
కంచిలీ: ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలు
జె. నారాయణపురం గ్రామానికి చెందిన కర్రి ప్రసాద్ ఒకేసారి మూడు బ్యాంక్ ఉద్యోగాలు సాధించాడు. ఐబీపీఎస్...
By Jeeru Kumar 2026-03-02 11:17:23 0 632
Andhra Pradesh
ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు టిడిపి కార్యకర్తలకు 10 లక్షలు ప్రమాద బీమా పంపిణీ చేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రామాపురం మండలం లో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్తలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్...
By Benguluri Madhubabu 2026-03-14 10:47:41 0 218
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com