Nara Lokesh: శ్రీవారి లడ్డూ కల్తీపై పూర్తి వివరాలను రేపు అసెంబ్లీలో వెల్లడిస్తాం: నారా లోకేశ్.

0
83

 

 

Nara Lokesh: శ్రీవారి లడ్డూ కల్తీపై పూర్తి వివరాలను రేపు అసెంబ్లీలో వెల్లడిస్తాం: నారా లోకేశ్

23-02-2026 Mon 12:21 | Andhra

Nara Lokesh to Reveal Tirumala Laddu Adulteration Details in Assembly

శ్రీవారి లడ్డూ కల్తీకి సంబంధించిన వాస్తవాలను అసెంబ్లీ వేదికగా బయటపెడతామన్న నారా లోకేశ్

ఆధారాలు సహా అన్నీ బయటపెడతామని వెల్లడి

రాజకీయలబ్ధి కోసం దేవుడిని రోడ్డు మీదకు తీసుకువస్తున్నారని మండిపాటు

 

 

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన అపచారానికి సంబంధించి కీలక వాస్తవాలను అసెంబ్లీ వేదికగా బహిర్గతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. సోమవారం ప్రారంభమైన ఎనిమిదవ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో కలియుగ దైవానికి జరిగిన మహాపచారంపై పూర్తి వివరాలను రేపు సభ ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో దోషులెవరో, కల్తీ నెయ్యి వినియోగం వెనుక ఉన్న వాస్తవాలేమిటో ఆధారాలతో బయటపెడతామని ఆయన పేర్కొన్నారు.

 

 

 

అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా తప్పించుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చట్టసభకు రావడం, ప్రజా సమస్యలపై చర్చించడం శాసనసభ్యులుగా వారి ప్రాథమిక బాధ్యత అని గుర్తు చేశారు. "అసెంబ్లీకి రమ్మని ఎవరూ బొట్టుపెట్టి పిలవరు" అంటూ వైసీపీ నేతలకు చురకలంటించిన ఆయన... సభను బహిష్కరించడం ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం దేవుడిని సైతం రోడ్డు మీదకు తీసుకురావడం బాధాకరమని, దేవుడి ఫొటోలతో చట్టసభల ప్రాంగణంలో ర్యాలీలు చేయడం అత్యంత అభ్యంతరకరమని ఆయన వ్యాఖ్యానించారు.

 

 

 

గత జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) ఇప్పటికే తన విచారణను పూర్తి చేసి నివేదికను అందజేసింది. అయితే తమ తప్పేమీ లేదని, ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ నేతలు వాదిస్తున్న తరుణంలో... ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టబోయే నివేదికపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

Search
Categories
Read More
Telangana
జనసేవకుడు పెద్దపురం నరసింహకు డాక్టరేట్ పురస్కారం.
గత 15 సంవత్సరాలుగా పుట్టిన బిడ్డ నుండి పండు ముసలి వాళ్ల వరకు నిరంతరం సేవ చేస్తూ.. ముందు వరసలో...
By Sidhu Maroju 2025-06-16 18:12:46 2 2K
Manipur
Displaced Families Blocked from Returning to Village in Manipur
 Security forces in Manipur halted the return of nearly 100 internally...
By Bharat Aawaz 2025-07-17 06:59:52 0 979
Telangana
🗳️ గ్రామాభివృద్ధికి ఓటుతో మార్గం! – తెలంగాణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో
గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే కేవలం ఓట్ల పండుగ కాదు – ఇది గ్రామ ప్రజల చేతిలో అభివృద్ధికి...
By Pulse 2025-06-25 10:04:17 0 1K
Delhi - NCR
బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ దూకుడు!!!!!!!!!!!
ఢిల్లీ: బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ దూకుడుబెట్టింగ్ ప్రమోట్‌ చేసిన సెలబ్రిటీల...
By SivaNagendra Annapareddy 2025-12-19 13:42:44 0 187
Telangana
బస్తీ వాసులకు అండగా జీడి సంపత్ కుమార్ గౌడ్
మల్కాజిగిరి ముస్లిం బస్తివాసులు తమ బస్తి లో ప్రధానంగా నాలుగు సమస్యలు చాలా రోజులుగా...
By Vadla Egonda 2025-07-13 06:44:20 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com