ఎంఎస్ బేగ్ ని కలిసిన నవ్యాంధ్ర రచయిత సంఘం నాయకులు

0
87

*ఎంఎస్ బేగ్ ను కలిసిన నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు*

 

విజయవాడ పశ్చిమ

ఫిబ్రవరి 21 :

 

 

ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నియమింపబడిన ఎం.ఎస్.బేగు ని నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు శనివారం ఉదయం విజయవాడ భావానిపురం లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఛైర్మన్ గా నియమింపబడిన తర్వాత అధికారికంగా ఠాగూర్ గ్రంథాలయంలో జరిగే ఒక పుస్తకావిష్కరణ సభకు తొలిసారిగా హాజరవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని బేగ్ ను నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు శాలువాతో సత్కరించి, పుస్తకాలను జ్ఞాపికలుగా అందించారు. ఈ సందర్భంగా రచయితలకు గ్రంథాలయాలకు వున్న అనుబంధాన్ని ఆయనకు వివరించారు. అనంతరం బేగ్ మాట్లాడుతూ- గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ నాయకత్వంలో అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఎన్నో వసతులతో ఉన్నతంగా వేగంగా నిర్మాణం జరగబోతుందన్నారు. ఈ లైబ్రరీలో పుస్తకాలను డిజిటలైజ్ చేసే గొప్ప సౌకర్యం వుండబోతుందన్నారు. రచయితలకూ గ్రంథాలయాలకు మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేకుండా సామరస్యభావంతో అభివృద్ధి దిశగా అడుగులేద్దామని అన్నారు. అందుకు రచయితల సంఘాలు జర్నలిస్టు సంఘాలు తోడ్పాటునందించాలన్నారు. ఎం.ఎస్.బేగ్ ను కలిసిన వారిలో నవ్యాంధ్ర రచయితల సంఘం జనరల్ సెక్రెటరీ కలిమిశ్రీ, అభివృద్ధి కమిటీ కన్వీనర్ యేమినేని వెంకట రమణ, కోశాధికారి చొప్పా రాఘవేంద్రశేఖర్, జిల్లా నాయకులు విష్ణుభొట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు...

Search
Categories
Read More
Telangana
మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు ఆందోళన
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా సమస్యలు పరిష్కారం కావడం లేదని, గత 20 ఏళ్లుగా పేద,...
By Ponnala Srinivasrao 2026-03-22 03:43:31 0 127
Telangana
మాకు ఇచ్చే వేతనం దేశ భవిష్యత్తుకు పెట్టుబడి
విద్య కమీషన్ ఇచ్చిన రిపోర్ట్ లో ఉపాధ్యాయులకు వేతనాలు ఎక్కువ.... అనే వాక్యాన్ని తీవ్రంగా...
By Bittu Bittu 2026-02-27 11:29:03 0 378
Andhra Pradesh
పుంగనూరు: అంబటి ఇంటి మీద దాడి పై స్పందించిన పెద్దిరెడ్డి
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిపై పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...
By Kothuru Murali 2026-02-01 09:46:56 0 117
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఇంజనీరింగ్ పనులు పునః ప్రారంభం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న...
By Rajini Kumari 2026-01-19 11:11:44 0 104
Andhra Pradesh
Vidyasagar: ఏపీ జేఏసీ చైర్మన్‌గా విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నిక.
అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా ప్రభుత్వం పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలన్న విద్యాసాగర్ 33 ఏళ్ల...
By Pagadala Venkateswar 2026-02-11 11:49:26 0 87
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com