ఎంఎస్ బేగ్ ని కలిసిన నవ్యాంధ్ర రచయిత సంఘం నాయకులు
*ఎంఎస్ బేగ్ ను కలిసిన నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు*
విజయవాడ పశ్చిమ
ఫిబ్రవరి 21 :
ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నియమింపబడిన ఎం.ఎస్.బేగు ని నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు శనివారం ఉదయం విజయవాడ భావానిపురం లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఛైర్మన్ గా నియమింపబడిన తర్వాత అధికారికంగా ఠాగూర్ గ్రంథాలయంలో జరిగే ఒక పుస్తకావిష్కరణ సభకు తొలిసారిగా హాజరవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని బేగ్ ను నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు శాలువాతో సత్కరించి, పుస్తకాలను జ్ఞాపికలుగా అందించారు. ఈ సందర్భంగా రచయితలకు గ్రంథాలయాలకు వున్న అనుబంధాన్ని ఆయనకు వివరించారు. అనంతరం బేగ్ మాట్లాడుతూ- గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ నాయకత్వంలో అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఎన్నో వసతులతో ఉన్నతంగా వేగంగా నిర్మాణం జరగబోతుందన్నారు. ఈ లైబ్రరీలో పుస్తకాలను డిజిటలైజ్ చేసే గొప్ప సౌకర్యం వుండబోతుందన్నారు. రచయితలకూ గ్రంథాలయాలకు మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేకుండా సామరస్యభావంతో అభివృద్ధి దిశగా అడుగులేద్దామని అన్నారు. అందుకు రచయితల సంఘాలు జర్నలిస్టు సంఘాలు తోడ్పాటునందించాలన్నారు. ఎం.ఎస్.బేగ్ ను కలిసిన వారిలో నవ్యాంధ్ర రచయితల సంఘం జనరల్ సెక్రెటరీ కలిమిశ్రీ, అభివృద్ధి కమిటీ కన్వీనర్ యేమినేని వెంకట రమణ, కోశాధికారి చొప్పా రాఘవేంద్రశేఖర్, జిల్లా నాయకులు విష్ణుభొట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు...
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy