ఎంఎస్ బేగ్ ని కలిసిన నవ్యాంధ్ర రచయిత సంఘం నాయకులు

0
144

*ఎంఎస్ బేగ్ ను కలిసిన నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు*

 

విజయవాడ పశ్చిమ

ఫిబ్రవరి 21 :

 

 

ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నియమింపబడిన ఎం.ఎస్.బేగు ని నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు శనివారం ఉదయం విజయవాడ భావానిపురం లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఛైర్మన్ గా నియమింపబడిన తర్వాత అధికారికంగా ఠాగూర్ గ్రంథాలయంలో జరిగే ఒక పుస్తకావిష్కరణ సభకు తొలిసారిగా హాజరవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని బేగ్ ను నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు శాలువాతో సత్కరించి, పుస్తకాలను జ్ఞాపికలుగా అందించారు. ఈ సందర్భంగా రచయితలకు గ్రంథాలయాలకు వున్న అనుబంధాన్ని ఆయనకు వివరించారు. అనంతరం బేగ్ మాట్లాడుతూ- గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ నాయకత్వంలో అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఎన్నో వసతులతో ఉన్నతంగా వేగంగా నిర్మాణం జరగబోతుందన్నారు. ఈ లైబ్రరీలో పుస్తకాలను డిజిటలైజ్ చేసే గొప్ప సౌకర్యం వుండబోతుందన్నారు. రచయితలకూ గ్రంథాలయాలకు మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేకుండా సామరస్యభావంతో అభివృద్ధి దిశగా అడుగులేద్దామని అన్నారు. అందుకు రచయితల సంఘాలు జర్నలిస్టు సంఘాలు తోడ్పాటునందించాలన్నారు. ఎం.ఎస్.బేగ్ ను కలిసిన వారిలో నవ్యాంధ్ర రచయితల సంఘం జనరల్ సెక్రెటరీ కలిమిశ్రీ, అభివృద్ధి కమిటీ కన్వీనర్ యేమినేని వెంకట రమణ, కోశాధికారి చొప్పా రాఘవేంద్రశేఖర్, జిల్లా నాయకులు విష్ణుభొట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు...

Search
Categories
Read More
Andhra Pradesh
పేకాట స్థావరం పై దాడి....నలుగురు అరెస్ట్.
మదనపల్లె మండలంలోని కాట్లాటపల్లి రోడ్డులో పేకాట ఆడుతున్న నలుగురిని ఆదివారం సాయంత్రం అరెస్టు...
By Pagadala Venkateswar 2026-05-25 04:33:55 0 83
Andhra Pradesh
Madanapalle: ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కొండామర్రిపల్లి పంచాయతీ టీడీపీ ఇంచార్జ్ జయరాం యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
మదనపల్లె: జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన...
By Pagadala Venkateswar 2026-07-21 09:59:23 0 39
Telangana
నిజామాబాద్
ఈ రోజు 19 వ డివిజన్ లోని కంటేశ్వర్ సంషేమ సంఘం లో పాల్స్ పోలియో కేంద్రానీ ప్రారంభించడం జరిగింది
By Sadaq Sadaq 2026-06-28 11:35:05 0 130
Telangana
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లో ప్రాథమిక పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి టిఫిన్స్ ప్రారంభోత్సవంలో...
    వెంకటాపురం ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వ అల్పాహార పథకం ప్రారంభం* భారత్ అవాజ్...
By Gujile Ramu 2026-06-15 09:49:55 0 156
Telangana
"అల్వాల్‌, బొల్లారం లో ఆగని దొంగల 'షికారు': రెండ్రోజుల్లో రెండు బైకులు మాయం!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నగర శివార్లలోని అల్వాల్.. బొల్లారం పరిసర ప్రాంతాల్లో వాహన దొంగలు...
By Sidhu Maroju 2026-04-15 16:27:48 0 321
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com