నేడే ఫిబ్రవరి 21 రైతు ఉత్సవం

0
96

*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌*

*ఎన్‌టీఆర్ జిల్లా, ఫిబ్ర‌వ‌రి 20, 2026*

 

*నేడే (ఫిబ్ర‌వ‌రి 21) భారీస్థాయిలో ఆర్గానిక్ రైతోత్స‌వం*

- *అన్న‌దాత‌లు, ఔత్సాహికులు స‌ద్వినియోగం చేసుకోండి*

- *కార్య‌క్ర‌మం విజ‌య‌వంతానికి స‌మ‌ష్టిగా కృషిచేద్దాం*

- *జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌*

 

ఈ నెల 21వ తేదీ శ‌నివారం ఎ.కొండూరు మండ‌లం, కృష్ణారావుపాలెంలో భారీస్థాయిలో ఎన్‌టీఆర్ జిల్లా సేంద్రియ మేళా-ఆర్గానిక్ రైతోత్స‌వం జ‌ర‌గ‌నుంద‌ని.. అన్న‌దాత‌లు, ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ఔత్సాహికులు పెద్దఎత్తున పాల్గొని, కార్య‌క్ర‌మాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ కోరారు.

ఈ నెల 21న కృష్ణారావుపాలెం, 22వ తేదీన విజ‌య‌వాడ‌లో ఎన్‌టీఆర్ ఆర్గానిక్ రైతోత్స‌వం జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో వీటికి చేస్తున్న ఏర్పాట్ల‌పై క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ శుక్ర‌వారం.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌తో క‌లిసి రెవెన్యూ, ప్ర‌కృతి వ్య‌వ‌సాయం, ఉద్యాన‌, ప‌శుసంవ‌ర్థ‌క త‌దిత‌ర స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌తో వ‌ర్చువ‌ల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ సేంద్రియ వ్య‌వ‌సాయంపై విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు రైతుల‌కు సామ‌ర్థ్య అభివృద్ధి, శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌ని వివ‌రించారు. ఈ మేళాలో సేంద్రియ ఉత్ప‌త్తుల ప్ర‌ద‌ర్శ‌న‌, విక్ర‌య స్టాళ్లు కూడా ఉంటాయ‌ని, సేంద్రియ సాగుకు అవ‌స‌ర‌మైన ఉత్పాదితాల ప్ర‌ద‌ర్శ‌న ఉంటుంద‌న్నారు. రైతు–నిపుణుల పరస్పర చర్చా వేదికల ద్వారా సందేహాల నివృత్తితో పాటు మేధోమ‌థ‌నానికి అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు వివ‌రించారు. ఇదేవిధంగా ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతులు, వినియోగ‌దారులు, సంస్థ‌ల‌ను ఒకే వేదిక‌పైకి తీసుకొచ్చే ల‌క్ష్యంతో ఈ నెల 22వ తేదీన విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మునిసిప‌ల్ మైదానంలోనూ ప్ర‌కృతి వ్య‌వ‌సాయ మేళాను నిర్వ‌హించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. రైతులు పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధ‌ర ల‌భించేలా మార్కెటింగ్ లింకేజీలు ఏర్పాటు చేయ‌డంతో పాటు ఎంవోయూలపై అవ‌గాహ‌న‌తో పాటు అవ‌కాశాలు క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మాలు విజ‌య‌వంతంగా నిర్వ‌హించి, మంచి ఫ‌లితాలు వ‌చ్చేలా అధికారులు స‌మ‌న్వ‌యంతో కృషిచేయాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించార

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్:డ్రాంకన్ డ్రైవ్ లో 22 మందికి జారిమాన
జిల్లా కేంద్రంలో మద్యం తాగిన 22 మందిని పట్టుకుని రాజకీయాలు వారిణి కోర్ట్ లో హజారు పరిచారు. విచారన...
By Sadaq Sadaq 2026-03-11 16:22:00 0 132
Andhra Pradesh
ప్రజాస్వామ్య దేశంలో దేవుళ్ళుగా భావించే ఓటర్లను నమ్మించి మోసం చేసిన చంద్రబాబు నైజాన్ని గుర్తు చేస్తూ జూన్ 4 ని వెన్నుపోటు దినంగా
ప్రజాస్వామ్య దేశంలో దేవుళ్ళుగా భావించే ఓటర్లను నమ్మించి మోసం చేసిన చంద్రబాబు నైజాన్ని గుర్తు...
By mahaboob basha 2025-06-05 00:37:56 0 2K
Andhra Pradesh
జనగణన-2027 రాష్ట్రస్థాయి సమావేశంలో పాలగొన్న: కలెక్టర్.
అమరావతిలో శుక్రవారం జరిగిన జనగణన-2027 రాష్ట్రస్థాయి సమావేశంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్...
By Pagadala Venkateswar 2026-02-21 04:30:49 0 98
Andhra Pradesh
కలెక్టర్ల సదస్సులు ముఖ్యమంత్రులు చంద్రబాబు
*For scrolls*   *అమరావతి*   *జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
By Rajini Kumari 2025-12-17 09:03:54 0 163
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com