కాకినాడ ఎంపీని కలిసిన సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్

0
1K

పెద్దాపురంలో నిర్మాణంలో ఉన్న వృద్ధాశ్రమానికి తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేసినందుకు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు గురువారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రతినిధులు మాట్లాడుతూ, ‘ప్రశాంత నిలయం’ వృద్ధాశ్రమ నిర్మాణానికి ఎంపీ అందించిన సహాయం వృద్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆశ్రమం త్వరితగతిన పూర్తై వృద్ధులకు సౌకర్యాలు అందాలని ఆకాంక్షించారు.

అలాగే కాకినాడ బోట్స్ క్లబ్‌లో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ‘డే కేర్ సెంటర్’ ఏర్పాటు చేయాలని ఎంపీని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ స్పందిస్తూ, వృద్ధుల సంక్షేమం తన ప్రాధాన్యతలలో ఒకటని, వారి అవసరాలను గుర్తించి త్వరలోనే ఈ అంశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.

వృద్ధుల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. సమావేశంలో సీనియర్ సిటిజన్ సంఘ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Business & Finance
Zimmer Biomet Expands Bengaluru Tech Workforce
Global medical device manufacturer Zimmer Biomet has announced plans to hire 500 employees over...
By Navya Sree 2026-07-03 07:07:27 0 32
Andhra Pradesh
నందిగామలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్
నందిగామలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్. ప్రజా దర్బార్‌లో ప్రజల వినతులు...
By Patan Khuddus 2026-04-18 11:10:09 0 481
Telangana
ఓ సీఎం సర్..అతను నీకు గులామ్ అనుకున్నవా
ఇందూరు ప్రజల గుండె చప్పుడు. నీ ప్రభుత్వంలో అతను ప్రజా ప్రతినిథి కాకపోవచ్చు. కానీ గురువుకే గురువు...
By Ponnala Srinivasrao 2026-03-25 02:23:28 0 185
West Bengal
Bengal Budget 2026: 1 Lakh Jobs & ₹5,000 Cr Industry Boost
Following the historic presentation of West Bengal’s 2026 budget by Finance Minister Swapan...
By Lokeshwari Panthadi 2026-06-25 12:35:28 0 65
Andhra Pradesh
ఇచ్ఛా పురం నుండి తిరుమల వరకు సైకిల్ యాత్ర
ఇచ్చాపురం న కు చెందిన ప్రసాద్ అనే యువకుడు సైకిల్ యాత్ర ఇచ్ఛాపురం నుండి తిరుమల వరకు...
By Mobbu Venkatramana 2026-02-10 12:16:56 8 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com