ఆలయానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చోరీ – రూ.4 లక్షల విలువైన నగలు అపహరణ

0
1K

పెద్దాపురం పట్టణంలోని విశాలాక్షి నగర్‌లో సోమవారం రాత్రి చోరీ ఘటన చోటుచేసుకుంది. ఉమ్మెళ్ల ప్రసాద్ నివాసంలో దొంగలు చొరబడి బంగారం, వెండి వస్తువులు అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం, ఇంటి యజమాని ఉమ్మెళ్ల ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి సామర్లకోటలోని భీమేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ప్రధాన ద్వార తాళాలు పగలగొట్టబడినట్లు గమనించారు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉండటంతో పాటు అందులో ఉంచిన సుమారు రూ.4 లక్షల విలువైన బంగారు నగలు, ఒక కిలో వెండి వస్తువులు కనిపించకుండా పోయినట్లు గుర్తించారు.

ఈ ఘటనపై మంగళవారం పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న సీఐ విజయ్ శంకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మౌనిక తెలిపారు.

పట్టణంలో వరుసగా చోరీలు జరుగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రాత్రి గస్తీని మరింత బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తాజా వాతావరణ వివరాలు ఏపీలో చలి తీవ్రత
*ఏపీలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. పగటిపూట ఎండ ఉన్నప్పటికీ, రాత్రి మరియు తెల్లవారుజామున...
By Rajini Kumari 2025-12-18 08:11:37 0 166
Telangana
తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్*
ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త.  దీనివల్ల ప్రజలు అనవసరంగా బంకుల వద్ద క్యూ...
By Veeresh Kumar 2026-03-25 14:38:27 0 202
Telangana
నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్... విద్యుత్ శాఖ...
భారత్అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా ఈరోజు విద్యుత్ శాఖలో ప్రమాదాలు జరగకుండా కావలసిన పరికరాలు...
By Gujile Ramu 2026-05-01 07:08:24 0 191
Andhra Pradesh
తాళం వేసి మూసి ఉన్న ఇళ్ల భద్రత కోసం పోలీసు వారు ఉచితంగా అందించే సీసీ కెమెరాలు(LHMS) ఉపయోగించుకోవాలని అంటున్న గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వాకుల్ జిందల్ ఐపీఎస్ గారు
  >kvsr. కోటేశ్వరరావు. గుంటూరు.    *గుంటూరు జిల్లా పోలీస్...*...
By KOTESWARARAO KVSR 2026-01-12 09:44:12 0 416
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com