ఆలయానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చోరీ – రూ.4 లక్షల విలువైన నగలు అపహరణ

0
654

పెద్దాపురం పట్టణంలోని విశాలాక్షి నగర్‌లో సోమవారం రాత్రి చోరీ ఘటన చోటుచేసుకుంది. ఉమ్మెళ్ల ప్రసాద్ నివాసంలో దొంగలు చొరబడి బంగారం, వెండి వస్తువులు అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం, ఇంటి యజమాని ఉమ్మెళ్ల ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి సామర్లకోటలోని భీమేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ప్రధాన ద్వార తాళాలు పగలగొట్టబడినట్లు గమనించారు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉండటంతో పాటు అందులో ఉంచిన సుమారు రూ.4 లక్షల విలువైన బంగారు నగలు, ఒక కిలో వెండి వస్తువులు కనిపించకుండా పోయినట్లు గుర్తించారు.

ఈ ఘటనపై మంగళవారం పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న సీఐ విజయ్ శంకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మౌనిక తెలిపారు.

పట్టణంలో వరుసగా చోరీలు జరుగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రాత్రి గస్తీని మరింత బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Search
Categories
Read More
Telangana
బుధవారం దర్శనం బంద్
ములుగు, డిసెంబర్ 23 (భారత్ అవాజ్) : ములుగు జిల్లాలోని  మేడారంలో కొలువైన సమ్మక్క-సారలమ్మ ఆలయ...
By Bittu Bittu 2025-12-23 07:28:51 0 465
Andhra Pradesh
పుంగనూరులో నుజ్జు నజ్జు అయిన ద్విచక్ర వాహనం
శుక్రవారం రాత్రి పుంగనూరు పట్టణంలో పుంగమ్మ చెరువు కట్టపై పుంగనూరు నుంచి బైరెడ్డిపల్లికి వెళ్తున్న...
By Kothuru Murali 2026-01-17 12:44:22 0 103
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాను HIV రహితంగా తీర్చిదిద్దుదాం: డీఎంహెచ్‌ఓ.
అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం డి. ఏ. పి. సి. సి – కమ్యూనిటీ అడ్వైజరీ...
By Pagadala Venkateswar 2026-03-11 03:09:57 0 85
Telangana
జనాభా లెక్కల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
మంచిర్యాల: జనాభా లెక్కల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి మంచిర్యాల కలెక్టరేట్ లో అధికారులు,...
By Pinnehasan Odela 2026-03-11 17:03:58 0 107
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com