ఆలయానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చోరీ – రూ.4 లక్షల విలువైన నగలు అపహరణ

0
1K

పెద్దాపురం పట్టణంలోని విశాలాక్షి నగర్‌లో సోమవారం రాత్రి చోరీ ఘటన చోటుచేసుకుంది. ఉమ్మెళ్ల ప్రసాద్ నివాసంలో దొంగలు చొరబడి బంగారం, వెండి వస్తువులు అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం, ఇంటి యజమాని ఉమ్మెళ్ల ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి సామర్లకోటలోని భీమేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ప్రధాన ద్వార తాళాలు పగలగొట్టబడినట్లు గమనించారు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉండటంతో పాటు అందులో ఉంచిన సుమారు రూ.4 లక్షల విలువైన బంగారు నగలు, ఒక కిలో వెండి వస్తువులు కనిపించకుండా పోయినట్లు గుర్తించారు.

ఈ ఘటనపై మంగళవారం పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న సీఐ విజయ్ శంకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మౌనిక తెలిపారు.

పట్టణంలో వరుసగా చోరీలు జరుగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రాత్రి గస్తీని మరింత బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Search
Categories
Read More
Goa
Goa to Launch New Sports Policy by 2025, Says SAG Chief |
Goa will unveil a new Sports Policy by the end of 2025, according to Ajay Gaude, the...
By Pooja Patil 2025-09-16 08:55:38 0 913
Andhra Pradesh
కడిమెట్ల గ్రామంలో తాగునీటి కొరత
కడిమెట్ల గ్రామంలో తాగునీటి కొరత ఉండడంతో అధికారులు నిర్లక్ష్యం వల్ల MRO పంచాయతీ సెక్రెటరీ...
By Boya Dasthagiri 2026-04-22 09:24:53 0 169
Andhra Pradesh
గుంటూరు ఈస్ట్ డిఎస్పి అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో రాష్ డ్రైవింగ్ మరియు బైక్ రేసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగినది.
గుంటూరు జిల్లా SP శ్రీ వకుల్ జిందాల్ గారి ఆదేశాల మేరకు గుంటూరు East DSP గారు అయిన SK అబ్దుల్...
By KOTESWARARAO KVSR 2025-12-24 17:18:50 0 235
Bharat Aawaz
"చేనేత - భారతీయ గర్వం, మన చేతిలో భవిష్యత్"
ఇది మన కథే, మన గౌరవం కూడా – చేనేతను గౌరవిద్దాం! మన దేశ గౌరవం, మన చేతిలో దాగి ఉంది. మనం...
By Pulse 2025-08-07 10:24:40 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com