• అసెంబ్లీ భవన మరమ్మతుల పరిశీలన


    హైదరాబాద్ :చారిత్రక ప్రాధాన్యం కలిగిన తెలంగాణ శాసనసభ భవనంలో జరుగుతున్న మరమ్మతు, పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రాంగణమంతా తిరిగి పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని, పలు సూచనలు చేశారు.


    శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, జైవీర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
    అసెంబ్లీ భవన మరమ్మతుల పరిశీలన హైదరాబాద్ :చారిత్రక ప్రాధాన్యం కలిగిన తెలంగాణ శాసనసభ భవనంలో జరుగుతున్న మరమ్మతు, పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రాంగణమంతా తిరిగి పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని, పలు సూచనలు చేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, జైవీర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
    0 Comments 0 Shares 140 Views 0 Reviews
  • తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్య..!


    డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్వామి..!


    ఉదయం 5.30 సమయంలో వాష్ రూమ్ లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న స్వామి..!


    సూసైడ్ నోట్ లభ్యం..


    తన భార్య పిల్లలను ఏమి అనవద్దని.. చనిపోయి దయ్యం అయినా కూడా వాళ్ళను చూసుకుంటానని.. వాళ్ళు మంచివాళ్ళని ఓ నోట్ బుక్ లో సూసైడ్ నోట్ రాసిన స్వామి..!
    తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్య..! డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్వామి..! ఉదయం 5.30 సమయంలో వాష్ రూమ్ లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న స్వామి..! సూసైడ్ నోట్ లభ్యం.. తన భార్య పిల్లలను ఏమి అనవద్దని.. చనిపోయి దయ్యం అయినా కూడా వాళ్ళను చూసుకుంటానని.. వాళ్ళు మంచివాళ్ళని ఓ నోట్ బుక్ లో సూసైడ్ నోట్ రాసిన స్వామి..!
    0 Comments 0 Shares 96 Views 0 Reviews
  • రేపు తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు


    హైదరాబాద్: తెలంగాణలో రేపు విద్యాసంస్థల బంద్‌కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో విద్యార్థులపై జరిగిన పోలీసు దాడులపై న్యాయపరమైన విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.


    అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, **నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)**ను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు కోరాయి. అదేవిధంగా వీబీఎస్‌ఏ (VBSA) బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి.


    బంద్‌కు పిలుపు నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పరిస్థితిపై ఆసక్తి నెలకొంది. అధికార యంత్రాంగం శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపడుతోంది.
    రేపు తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు హైదరాబాద్: తెలంగాణలో రేపు విద్యాసంస్థల బంద్‌కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో విద్యార్థులపై జరిగిన పోలీసు దాడులపై న్యాయపరమైన విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, **నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)**ను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు కోరాయి. అదేవిధంగా వీబీఎస్‌ఏ (VBSA) బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. బంద్‌కు పిలుపు నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పరిస్థితిపై ఆసక్తి నెలకొంది. అధికార యంత్రాంగం శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపడుతోంది.
    0 Comments 0 Shares 123 Views 0 Reviews
  • పార్లమెంట్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసి ఆగస్ట్ 1వ తేదీన జరిగే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
    #AlluriSitaramaRajuAirport
    #NarendraModi
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    పార్లమెంట్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసి ఆగస్ట్ 1వ తేదీన జరిగే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. #AlluriSitaramaRajuAirport #NarendraModi #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 221 Views 0 Reviews
  • "భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వం, స్వేచ్ఛ, ప్రజాస్వామిక విలువలకు ప్రతీకగా ప్రతి భారతీయుడిలో స్ఫూర్తిని నింపే త్రివర్ణ పతాకం.. ‘జాతీయ జెండా ఆమోద దినోత్సవం’ రోజున, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన సమరయోధులను స్మరించుకుందాం.


    మన త్రివర్ణ పతాకం వారి త్యాగాలకు, దేశభక్తికి చిరస్మరణీయ ప్రతీక. జాతీయ జెండాను గౌరవించడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ విలువలను ప్రతిరోజూ ఆచరిస్తూ, మన జాతీయ పతాకానికి నిజమైన గౌరవాన్ని అందిద్దాం" అని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు.
    "భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వం, స్వేచ్ఛ, ప్రజాస్వామిక విలువలకు ప్రతీకగా ప్రతి భారతీయుడిలో స్ఫూర్తిని నింపే త్రివర్ణ పతాకం.. ‘జాతీయ జెండా ఆమోద దినోత్సవం’ రోజున, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన సమరయోధులను స్మరించుకుందాం. మన త్రివర్ణ పతాకం వారి త్యాగాలకు, దేశభక్తికి చిరస్మరణీయ ప్రతీక. జాతీయ జెండాను గౌరవించడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ విలువలను ప్రతిరోజూ ఆచరిస్తూ, మన జాతీయ పతాకానికి నిజమైన గౌరవాన్ని అందిద్దాం" అని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు.
    0 Comments 0 Shares 109 Views 0 Reviews
  • ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు రేపటి నుంచి రెండు రోజుల పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా దుద్యాల్ మండలం హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షిస్తారు.


    రాత్రి కొడంగల్‌లో బసచేసి మరుసటి రోజు (22వ తేదీన) నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. SIR కొనసాగుతున్న తీరును ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తారు. మధ్యాహ్నం తర్వాత తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
    ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు రేపటి నుంచి రెండు రోజుల పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా దుద్యాల్ మండలం హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. రాత్రి కొడంగల్‌లో బసచేసి మరుసటి రోజు (22వ తేదీన) నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. SIR కొనసాగుతున్న తీరును ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తారు. మధ్యాహ్నం తర్వాత తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
    0 Comments 0 Shares 145 Views 0 Reviews
  • ఇండియా గేట్ వద్ద కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పలువురు అదుపులోకి


    న్యూఢిల్లీ: పేపర్ లీకుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఇండియా గేట్ వద్ద మెరుపు ధర్నా నిర్వహించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.


    ధర్నాకు దిగిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయలేరని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.


    పేపర్ లీకులకు బాధ్యులైన వారందరిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.
    ఇండియా గేట్ వద్ద కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పలువురు అదుపులోకి న్యూఢిల్లీ: పేపర్ లీకుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఇండియా గేట్ వద్ద మెరుపు ధర్నా నిర్వహించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ధర్నాకు దిగిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయలేరని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. పేపర్ లీకులకు బాధ్యులైన వారందరిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.
    0 Comments 0 Shares 163 Views 0 Reviews
  • పత్రికా ప్రకటన


    రంగారెడ్డి జిల్లాలో రేపు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day) Mop-up Round నిర్వహణ


    రంగారెడ్డి జిల్లాలో రేపు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day) Mop-up Round నిర్వహించబడుతుందని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. స్వర్ణకుమారి తెలిపారు.


    ప్రధాన విడతలో నులిపురుగుల నివారణ మాత్ర (Albendazole) తీసుకోలేకపోయిన 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, విద్యార్థులు ఈ Mop-up Round ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు మరియు ఆరోగ్య సంస్థల ద్వారా ఈ మాత్రలు ఉచితంగా అందించబడతాయని తెలిపారు.


    నులిపురుగుల నివారణ వల్ల పిల్లల్లో రక్తహీనత తగ్గడం, పోషకాహారం శరీరానికి బాగా అందడం, శారీరక మరియు మానసిక ఎదుగుదల మెరుగుపడడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు.


    తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు అంగన్‌వాడీ కార్యకర్తలు సహకరించి, ఇప్పటివరకు మాత్ర తీసుకోని ప్రతి చిన్నారికి ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చూడాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. స్వర్ణకుమారి విజ్ఞప్తి చేశారు.
    పత్రికా ప్రకటన రంగారెడ్డి జిల్లాలో రేపు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day) Mop-up Round నిర్వహణ రంగారెడ్డి జిల్లాలో రేపు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day) Mop-up Round నిర్వహించబడుతుందని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. స్వర్ణకుమారి తెలిపారు. ప్రధాన విడతలో నులిపురుగుల నివారణ మాత్ర (Albendazole) తీసుకోలేకపోయిన 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, విద్యార్థులు ఈ Mop-up Round ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు మరియు ఆరోగ్య సంస్థల ద్వారా ఈ మాత్రలు ఉచితంగా అందించబడతాయని తెలిపారు. నులిపురుగుల నివారణ వల్ల పిల్లల్లో రక్తహీనత తగ్గడం, పోషకాహారం శరీరానికి బాగా అందడం, శారీరక మరియు మానసిక ఎదుగుదల మెరుగుపడడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు అంగన్‌వాడీ కార్యకర్తలు సహకరించి, ఇప్పటివరకు మాత్ర తీసుకోని ప్రతి చిన్నారికి ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చూడాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. స్వర్ణకుమారి విజ్ఞప్తి చేశారు.
    0 Comments 0 Shares 147 Views 0 Reviews
  • కల్తీల నియంత్రణకు కఠిన చట్టం.. టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు: సీఎం రేవంత్


    హైదరాబాద్ :
    ఆహార, ఔషధ కల్తీలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చట్టం తీసుకురానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో శనివారం తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం (TGFADCA)పై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.


    కూరగాయలు, పండ్లు, పాలు తదితర ఆహార పదార్థాల్లో విచ్చలవిడిగా రసాయనాల వినియోగం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీల నివారణలో సమగ్ర చట్టాలు అమలు చేస్తున్న దేశాల విధానాలను అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా బిల్లు సిద్ధం చేసి శాసనసభలో సమగ్ర చర్చ అనంతరం చట్టం తీసుకురావాలని సూచించారు.


    కల్తీలపై సమాచారం సేకరణకు విజిల్‌బ్లోయర్లను నియమించడంతో పాటు ప్రజల ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే క్యూర్ (CURE) ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి నిబంధనలను తొలుత అక్కడ అమలు చేసి, అనుభవాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సూచించారు.


    సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సి.వి. ఆనంద్, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, సీఎం ప్రధాన కార్యదర్శులు వి. శేషాద్రి, ఎన్. శ్రీధర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
    కల్తీల నియంత్రణకు కఠిన చట్టం.. టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు: సీఎం రేవంత్ హైదరాబాద్ : ఆహార, ఔషధ కల్తీలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చట్టం తీసుకురానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో శనివారం తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం (TGFADCA)పై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కూరగాయలు, పండ్లు, పాలు తదితర ఆహార పదార్థాల్లో విచ్చలవిడిగా రసాయనాల వినియోగం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీల నివారణలో సమగ్ర చట్టాలు అమలు చేస్తున్న దేశాల విధానాలను అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా బిల్లు సిద్ధం చేసి శాసనసభలో సమగ్ర చర్చ అనంతరం చట్టం తీసుకురావాలని సూచించారు. కల్తీలపై సమాచారం సేకరణకు విజిల్‌బ్లోయర్లను నియమించడంతో పాటు ప్రజల ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే క్యూర్ (CURE) ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి నిబంధనలను తొలుత అక్కడ అమలు చేసి, అనుభవాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సి.వి. ఆనంద్, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, సీఎం ప్రధాన కార్యదర్శులు వి. శేషాద్రి, ఎన్. శ్రీధర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 183 Views 0 Reviews
  • అత్తాపూర్ పీఎస్ 2017 నాటి సంచలనాత్మక హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ గౌరవ న్యాయస్థానం తీర్పు


    హైదరాబాద్; అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంచలనాత్మక హత్య కేసు (Cr. No. 737/2017 U/s 302, 201 IPC; SC No. 974/2019) లో నేడు (17-07-2026), రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని గౌరవ X అడిషనల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జ్ (ADJ) కోర్టు కీలక తీర్పు వెల్లడించింది.


    నేరం నిరూపితమవడంతో నిందితుడైన నిసార్ అహ్మద్‌కు గౌరవ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష (LIFE IMPRISONMENT) రూ. 15,000/- జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.


    శిక్ష పడిన నిందితుడి వివరాలు:పేరు: నిసార్ అహ్మద్, తండ్రి: లేట్ సిరాజ్ అహ్మద్,వయస్సు & వృత్తి: 40 సంవత్సరాలు, లెదర్ (చర్మం) వ్యాపారం,చిరునామా: డోర్ నెం. 19, 1వ అంతస్తు, 1వ మెయిన్ రోడ్, 3వ క్రాస్ రోడ్, బెంగళూరు - 46, కర్ణాటక రాష్ట్రం.


    మృతుడి వివరాలు:పేరు: నీసార్ అహ్మద్, వయస్సు: 35 సంవత్సరాలు, వృత్తి: లెదర్ వ్యాపారం, నివాసం: బెంగళూరు నగరం.


    కేసు సంక్షిప్త వివరాలు: హైదరాబాద్ మెహదీపట్నం, సంతోష్ నగర్ కాలనీ (H.No. 12-2-823/A/158/3) నివాసి, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన శ్రీ మహ్మద్ అబ్దుల్ వహీద్ (74 సం.లు, తండ్రి: మహ్మద్ అబ్దుల్ కరీం) 24-04-2017 రోజున మధ్యాహ్నం 12:30 గంటలకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఇంగ్లీష్‌లో ఒక లిఖితపూర్వక ఫిర్యాదును అందించారు. ఫిర్యాదుదారునికి హైదరాబాద్ నగరంలో దాదాపు 50 ఫ్లాట్లు ఉన్నాయి.


    19-04-2017న ఫిర్యాదుదారుడు మొయినాబాద్‌లోని తన ఫామ్‌హౌస్‌లో ఉన్నప్పుడు, రెంటల్ బ్రోకర్ లతీఫుద్దీన్ ఫోన్ చేసి, ఇద్దరు వ్యక్తులు మెహదీపట్నంలో అద్దెకు ఫ్లాట్ కావాలని అడుగుతున్నట్లు తెలిపాడు. దానిపై సంతోష్ నగర్ కాలనీలోని 'సాజిద్ రెసిడెన్సీ' లో ఉన్న ఫ్లాట్ నెం. 105ను నెలకు రూ. 10,000/- అద్దెకు మాట్లాడారు.


    తమను తమిళనాడు వెల్లూరు జిల్లాకు చెందిన ఇంతియాజ్ (45 సం.), బెంగళూరుకు చెందిన నీసార్ అహ్మద్ (35 సం.) గా పరిచయం చేసుకున్న ఆ ఇద్దరు లెదర్ వ్యాపారులు, 19-04-2017 రాత్రి 19:00 గంటలకు ఫ్లాట్‌లోకి దిగారు. అనంతరం 20-04-2017 సాయంత్రం నిందితుడు నిసార్ అహ్మద్ ఫ్లాట్‌కు తాళం వేసి పరారయ్యాడు.


    24-04-2017న అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ ధర్మేంద్ర ఫ్లాట్ నెం. 105 నుండి దుర్వాసన వస్తోందని యజమానికి సమాచారం ఇచ్చాడు. ఫిర్యాదుదారుడు బ్రోకర్ లతీఫుద్దీన్, వాచ్‌మెన్‌తో కలిసి వచ్చి తాళం తెరిచి చూడగా, బాత్రూమ్‌లో కుళ్ళిపోయిన స్థితిలో నీసార్ అహ్మద్ శవం కనిపించింది.


    మృతుడి నుదుటిపై రాయితో కొట్టిన తీవ్ర గాయాలు ఉన్నాయి, అలాగే మెడకు తాడు చుట్టి ఉంది. వ్యాపార వివాదాల కారణంగానే నిందితుడు నిసార్ అహ్మద్ ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు తేలింది. ఆ తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.


    పోలీస్ ,ప్రాసిక్యూషన్ బృందానికి అభినందనలు:
    ఈ కేసులో పక్కా ఆధారాలతో దర్యాప్తు చేసి, నిందితుడికి శిక్ష పడేలా శ్రమించిన పోలీస్ , ప్రాసిక్యూషన్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.


    దర్యాప్తు అధికారి (IO): జి. సురేష్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి (SHO): ఎ. సీతయ్య, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అత్తాపూర్ పీఎస్ (ఫోన్: 8712663410)
    • పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (PP): టి. వెంకటేశ్వర ప్రసాద్, & పి. కృష్ణమూర్తి (ఫోన్: +919247289390)
    1. కోర్టు డ్యూటీ అధికారులు (CDO): ఎ. అమృత, WASI 4732 ,వెంకటేష్ చారి, PC 6062
    • సమన్స్ విభాగం: పి. ప్రవీణ్ కుమార్, HG 986
    • లైజన్ అధికారులు: ఎస్. నరసింహులు, PC 4384 & జి. శివరెడ్డి, ASI.
    అత్తాపూర్ పీఎస్ 2017 నాటి సంచలనాత్మక హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ గౌరవ న్యాయస్థానం తీర్పు హైదరాబాద్; అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంచలనాత్మక హత్య కేసు (Cr. No. 737/2017 U/s 302, 201 IPC; SC No. 974/2019) లో నేడు (17-07-2026), రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని గౌరవ X అడిషనల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జ్ (ADJ) కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నేరం నిరూపితమవడంతో నిందితుడైన నిసార్ అహ్మద్‌కు గౌరవ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష (LIFE IMPRISONMENT) రూ. 15,000/- జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. శిక్ష పడిన నిందితుడి వివరాలు:పేరు: నిసార్ అహ్మద్, తండ్రి: లేట్ సిరాజ్ అహ్మద్,వయస్సు & వృత్తి: 40 సంవత్సరాలు, లెదర్ (చర్మం) వ్యాపారం,చిరునామా: డోర్ నెం. 19, 1వ అంతస్తు, 1వ మెయిన్ రోడ్, 3వ క్రాస్ రోడ్, బెంగళూరు - 46, కర్ణాటక రాష్ట్రం. మృతుడి వివరాలు:పేరు: నీసార్ అహ్మద్, వయస్సు: 35 సంవత్సరాలు, వృత్తి: లెదర్ వ్యాపారం, నివాసం: బెంగళూరు నగరం. కేసు సంక్షిప్త వివరాలు: హైదరాబాద్ మెహదీపట్నం, సంతోష్ నగర్ కాలనీ (H.No. 12-2-823/A/158/3) నివాసి, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన శ్రీ మహ్మద్ అబ్దుల్ వహీద్ (74 సం.లు, తండ్రి: మహ్మద్ అబ్దుల్ కరీం) 24-04-2017 రోజున మధ్యాహ్నం 12:30 గంటలకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఇంగ్లీష్‌లో ఒక లిఖితపూర్వక ఫిర్యాదును అందించారు. ఫిర్యాదుదారునికి హైదరాబాద్ నగరంలో దాదాపు 50 ఫ్లాట్లు ఉన్నాయి. 19-04-2017న ఫిర్యాదుదారుడు మొయినాబాద్‌లోని తన ఫామ్‌హౌస్‌లో ఉన్నప్పుడు, రెంటల్ బ్రోకర్ లతీఫుద్దీన్ ఫోన్ చేసి, ఇద్దరు వ్యక్తులు మెహదీపట్నంలో అద్దెకు ఫ్లాట్ కావాలని అడుగుతున్నట్లు తెలిపాడు. దానిపై సంతోష్ నగర్ కాలనీలోని 'సాజిద్ రెసిడెన్సీ' లో ఉన్న ఫ్లాట్ నెం. 105ను నెలకు రూ. 10,000/- అద్దెకు మాట్లాడారు. తమను తమిళనాడు వెల్లూరు జిల్లాకు చెందిన ఇంతియాజ్ (45 సం.), బెంగళూరుకు చెందిన నీసార్ అహ్మద్ (35 సం.) గా పరిచయం చేసుకున్న ఆ ఇద్దరు లెదర్ వ్యాపారులు, 19-04-2017 రాత్రి 19:00 గంటలకు ఫ్లాట్‌లోకి దిగారు. అనంతరం 20-04-2017 సాయంత్రం నిందితుడు నిసార్ అహ్మద్ ఫ్లాట్‌కు తాళం వేసి పరారయ్యాడు. 24-04-2017న అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ ధర్మేంద్ర ఫ్లాట్ నెం. 105 నుండి దుర్వాసన వస్తోందని యజమానికి సమాచారం ఇచ్చాడు. ఫిర్యాదుదారుడు బ్రోకర్ లతీఫుద్దీన్, వాచ్‌మెన్‌తో కలిసి వచ్చి తాళం తెరిచి చూడగా, బాత్రూమ్‌లో కుళ్ళిపోయిన స్థితిలో నీసార్ అహ్మద్ శవం కనిపించింది. మృతుడి నుదుటిపై రాయితో కొట్టిన తీవ్ర గాయాలు ఉన్నాయి, అలాగే మెడకు తాడు చుట్టి ఉంది. వ్యాపార వివాదాల కారణంగానే నిందితుడు నిసార్ అహ్మద్ ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు తేలింది. ఆ తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పోలీస్ ,ప్రాసిక్యూషన్ బృందానికి అభినందనలు: ఈ కేసులో పక్కా ఆధారాలతో దర్యాప్తు చేసి, నిందితుడికి శిక్ష పడేలా శ్రమించిన పోలీస్ , ప్రాసిక్యూషన్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. దర్యాప్తు అధికారి (IO): జి. సురేష్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి (SHO): ఎ. సీతయ్య, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అత్తాపూర్ పీఎస్ (ఫోన్: 8712663410) • పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (PP): టి. వెంకటేశ్వర ప్రసాద్, & పి. కృష్ణమూర్తి (ఫోన్: +919247289390) 1. కోర్టు డ్యూటీ అధికారులు (CDO): ఎ. అమృత, WASI 4732 ,వెంకటేష్ చారి, PC 6062 • సమన్స్ విభాగం: పి. ప్రవీణ్ కుమార్, HG 986 • లైజన్ అధికారులు: ఎస్. నరసింహులు, PC 4384 & జి. శివరెడ్డి, ASI.
    0 Comments 0 Shares 201 Views 0 Reviews
  • మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర అభివృద్ధికి రూ.13 కోట్లు
    హుజూర్నగర్ రూరల్/ భారత్ అవాజ్ :
    తెలంగాణలో ప్రసిద్ధి చెందిన మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.13 కోట్లను మంజూరు చేసింది.
    ఈ నిధులతో ఆలయ పరిసరాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
    అభివృద్ధి పనులు:
    ఆధునిక పర్యాటక సౌకర్యాల ఏర్పాటు
    భక్తులకు వసతి, తాగునీటి, పారిశుద్ధ్య సౌకర్యాలు
    బోటింగ్ కార్యకలాపాల అభివృద్ధి
    సందర్శకుల కోసం ఇతర సౌకర్యాల కల్పన
    మంజూరు చేసిన నిధులతో:
    ఆలయ పరిసరాల అభివృద్ధి
    భక్తుల కోసం మెరుగైన వసతులు
    పర్యాటకులను ఆకర్షించే మౌలిక సదుపాయాల ఏర్పాటు
    ఈ అభివృద్ధి పనులు పూర్తయితే మట్టపల్లి క్షేత్రం తెలంగాణలో ప్రముఖ ఆధ్యాత్మిక–పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం పేర్కొంది
    మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర అభివృద్ధికి రూ.13 కోట్లు హుజూర్నగర్ రూరల్/ భారత్ అవాజ్ : తెలంగాణలో ప్రసిద్ధి చెందిన మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.13 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో ఆలయ పరిసరాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అభివృద్ధి పనులు: ఆధునిక పర్యాటక సౌకర్యాల ఏర్పాటు భక్తులకు వసతి, తాగునీటి, పారిశుద్ధ్య సౌకర్యాలు బోటింగ్ కార్యకలాపాల అభివృద్ధి సందర్శకుల కోసం ఇతర సౌకర్యాల కల్పన మంజూరు చేసిన నిధులతో: ఆలయ పరిసరాల అభివృద్ధి భక్తుల కోసం మెరుగైన వసతులు పర్యాటకులను ఆకర్షించే మౌలిక సదుపాయాల ఏర్పాటు ఈ అభివృద్ధి పనులు పూర్తయితే మట్టపల్లి క్షేత్రం తెలంగాణలో ప్రముఖ ఆధ్యాత్మిక–పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం పేర్కొంది
    Like
    1
    0 Comments 0 Shares 248 Views 0 Reviews
  • *అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో 12 కోవిడ్ కేసులు నమోదు..!*


    *కడప జిల్లాకు చెందిన ముగ్గురు, కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు మృతి.*


    *మరణించిన వారందరికీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నాయి.*


    *జూన్ 26 నుంచి జూలై 16 వరకు 12 కోవిడ్ కేసులు నమోదు.*


    *ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ముందు జాగ్రత్తలు పాటించాలి.*


    *వైద్యులు, ఆసపత్రుల సిబ్బందిని అప్రమత్తం చేస్తాం.*


    *: వైద్యారోగ్య శాఖ*
    *అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో 12 కోవిడ్ కేసులు నమోదు..!* *కడప జిల్లాకు చెందిన ముగ్గురు, కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు మృతి.* *మరణించిన వారందరికీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నాయి.* *జూన్ 26 నుంచి జూలై 16 వరకు 12 కోవిడ్ కేసులు నమోదు.* *ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ముందు జాగ్రత్తలు పాటించాలి.* *వైద్యులు, ఆసపత్రుల సిబ్బందిని అప్రమత్తం చేస్తాం.* *: వైద్యారోగ్య శాఖ*
    0 Comments 0 Shares 210 Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com