చొల్లంగి వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం

0
101

పోలీసుల దర్యాప్తు ప్రారంభం

తాళ్లరేవు, తాళ్లరేవు మండలం చొల్లంగి రోడ్డుపక్కన బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. రాత్రి సమయంలో అక్కడి ప్రజలు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు సుమారు 40–45 ఏళ్ల వయస్సు గల వ్యక్తిగా గుర్తించారు. మృతదేహంపై ‘రవికుమార్’, ‘బుజ్జి అమ్మ’ అనే పేర్లతో పచ్చబొట్లు ఉన్నట్లు తెలిపారు. అలాగే ఎరుపు రంగు కాశీతాడు ధరించి ఉన్నట్లు గుర్తించారు.

మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని, అనుమానాస్పద మృతి కోణంలో విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మృతుడి వివరాలు తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కోరంగి ఎస్‌ఐ సత్యనారాయణ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రచ్చ బండ
ప్రస్తుత కాలంలో పూర్వం గ్రామాలలో.రచ్చబండ ల దగ్గర .చెట్ల క్రింద వివిధ సమస్యల పైన రాజకీయ పరిపాలన...
By Mobbu Venkatramana 2026-03-05 13:35:58 0 255
Andhra Pradesh
పుంగునూరు: పట్టణ పరిధిలో గల పుణ్యమ్మ చెరువులోకి హంద్రీనీవా జలాలు: మరవ వద్ద గ్రామస్తుల ఏర్పాట్లు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణ పరిధిలోని 50 రాళ్ల మరవ వద్ద ఆదివారం గ్రామస్తులు ఏర్పాట్లు...
By Kothuru Murali 2026-02-08 10:30:13 0 111
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడు
పుంగనూరు మండలం, పూజాగానిపల్లి మలుపు వద్ద రోడ్డుపై నడిచి వెళ్తున్న సూర్యచంద్రరావు (87) ను పుంగనూరు...
By Kothuru Murali 2025-12-29 13:52:25 0 156
Life Style
"JOMO" Replaces the Travel Rush
The travel landscape this May 19 presents a pivot from frantic sightseeing to intentional...
By Dunna Jessicaruth 2026-05-19 06:44:08 0 27
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com