Chandrababu Naidu: లోకేశ్ పని లోకేశ్ చేస్తున్నాడు... నా పని నేను చేస్తున్నా: సీఎం చంద్రబాబు.

0
156

పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల పనితీరును సమగ్రంగా విశ్లేషిస్తున్నామన్న సీఎం చంద్రబాబు

 

లోపాలను సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు

ఎమ్మెల్యేల పనితీరుపై మరింత కఠినంగా పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడి

లోకేశ్ పని లోకేశ్ చేస్తున్నాడు.. నా పని నేను చేస్తున్నానంటూ టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో నిన్న నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. 

 

పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల పనితీరును సమగ్రంగా విశ్లేషిస్తున్నామని, వారి పనిపై సర్వేలు నిర్వహించి వ్యక్తిగత నివేదికలను సీల్డ్ కవర్లలో అందజేస్తున్నామని వెల్లడించారు. ఈ నివేదికలు వారికి అద్దం పట్టినట్టుగా ఉంటాయని, లోపాలను సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

 

తొమ్మిది ముఖ్య అంశాలపై అంచనా వేసి నివేదికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 1995 -96 మాదిరిగానే నిక్కచ్చిగా వ్యవహరిస్తానని పేర్కొన్న చంద్రబాబు .. సీల్డ్ కవర్లలో ఇచ్చే నివేదికల ద్వారా ఎమ్మెల్యేల బలాలు, బలహీనతలను స్పష్టంగా తెలియజేస్తున్నామని, మార్పు రాకపోతే నష్టం వాళ్లకేనని హెచ్చరించారు. ఇకపై ఎమ్మెల్యేల పనితీరుపై మరింత కఠినంగా పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు.

 

ఇదే సందర్భంగా లోకేశ్ తన బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తున్నారని కితాబు ఇచ్చారు. ముఖ్యంగా మంగళగిరి చేనేత చీరలకు అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ కల్పించే ప్రయత్నాలను అభినందిస్తూ, ఇవి చేనేత రంగానికి మేలు చేస్తాయని పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి గౌరవ వందనం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*Photos/Video :-* భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా క్యాంప్...
By Rajini Kumari 2026-04-14 09:15:29 0 177
Telangana
"తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ ప్రత్యేక ముద్ర".|
● యువ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు. ● ఐటీ, పరిశ్రమల అభివృద్ధిలో కీలక పాత్ర. ● ప్రతిపక్షంలోనూ...
By Sidhu Maroju 2026-07-23 08:15:17 0 41
Telangana
భాజపా శ్రేణులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం.|
- ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని పిలుపు. - అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో...
By Sidhu Maroju 2026-07-18 12:33:24 0 65
Andhra Pradesh
రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సమావేశానికి ఎమ్మెల్యే వేగేశన ను ఆహ్వానిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర
ఏప్రిల్ 19 వ తేదీన బాపట్ల లోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపంలో రాష్ట్ర స్థాయిలో మాజీ...
By Vadlamudi NagaVenkat 2026-04-11 09:33:01 0 157
Andhra Pradesh
కన్నతల్లిని జన్మభూమిని ఎన్నటికీ మరువకూడదు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రసంగం
*కన్నతల్లి, జన్మభూమిని ఎన్నటికీ మరువరాదు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు*  ...
By Rajini Kumari 2025-12-18 08:06:20 0 195
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com