మహా శివరాత్రి వేళ భక్తులకు పవన్ కళ్యాణ్ శుభవార్త.. అరుణాచలం తరహాలో అక్కడా ప్రతి నెల గిరి ప్రదక్షిణ.!

0
129

పాలక మండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. వైసీపీ హయాంలో గత పాలక మండలి బాధ్యతగా వ్యవహరించి ఉంటే తిరుమలలో అపచారాలు జరిగేవి కాదన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కొత్త పాలక మండళ్లకు సూచించారు. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గంలో నూతనంగా నిర్మించిన రహదారిని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. శివరాత్రి పూర్తయ్యాక ఈ మార్గంలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అలాగే అరుణాచలం తరహాలో శ్రీకాళహస్తిలోనూ ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
అనంతపురం: SBI బ్యాంక్ వారి ప్రాపర్టీ ఎక్స్‌పో 2026 ఈ 13,14 తేదీలు మాత్రమే రుణాల ఆఫర్
అనంత: SBI వారి గృహ రుణాలు 13,14 తేదీలలో సంక్రాంతి ఆఫర్లు ఇస్తుంది  వివిధ రియల్ ఎస్టేట్...
By Eslavath RameshNaik 2026-01-14 07:13:30 0 200
Telangana
అంగరంగ వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం
  భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం రామయ్య నిత్య కళ్యాణం అర్చకులచే ఉదయం బేడా...
By Lakavath Kiran 2026-03-14 15:44:58 0 253
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com