లోకేష్ సార్ మా పాఠశాలను కాపాడండి.

0
83

లోకేశ్‌ సర్‌... మా పాఠశాలను కాపాడండి

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు మదనపల్లె మండలం కొత్తవారిపల్లె పంచాయతీ పాలెంకొండకు చెందిన పూర్వ విద్యార్థిని బి.నాగలక్ష్మి వాట్సాప్‌ ద్వారా లేఖ రాసింది. 1991లో సీఎం చంద్రబాబు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మంజూరు చేయబడిందని, ప్రస్తుతం 20 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని ఆమె తెలిపింది. ఇదే పల్లెలో వైసీపీ నేత ఒకరు పాఠశాల ఆవరణలోని 2కుంటల స్థలాన్ని ఆక్రమించేందుకు కుట్రలు పన్నారని, కొండ నీళ్లను పాఠశాల ఆవరణలోకి మళ్లించాడని, బయో ఫెన్సింగ్‌ మొక్కలను ఆవులతో మేపించేశాడని పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, పాఠశాల మూతపడితే స్థలాన్ని ఆక్రమించడం సులువు అవుతుందని భావించి టీచర్లను బెదిరిస్తున్నారని తెలిపింది. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకుని పాఠశాల స్థలానికి రక్షణ కల్పించి, పాఠశాల మూతపడకుండా చూడాలని కోరింది.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో రోడ్డు ప్రమాదం – వృద్ధుడికి తీవ్ర గాయాలు
మదనపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 70 ఏళ్ల మక్బూల్ అనే వృద్ధుడు తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-01-15 07:27:23 0 116
Andhra Pradesh
నారా భువనేశ్వరి గారికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే శిరీష దేవి
*Photos:-* రంపచోడవరం మండలం సీతపల్లికి చేరుకున్న భువనేశ్వరికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే శిరీషా...
By Rajini Kumari 2025-12-21 14:14:13 0 195
Andhra Pradesh
శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న చిత్ర బృందం
మహాసేయులకు విజ్ఞప్తి' సినిమా బృందం సోమవారం కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుంది....
By Kothuru Murali 2026-01-12 13:55:59 0 123
Andhra Pradesh
వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ ప్రమాదం.. 21 మంది మృతి
  కాకినాడ జిల్లా కాకినాడ జిల్లాలో తీవ్ర విషాధం చోటు చేసుకుంది. శనివారం సామర్లకోట మండలం...
By BABJI DADALA 2026-02-28 14:45:04 0 175
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com