శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి

0
135

పత్రికా ప్రకటన

ఇంద్రకీలాద్రి, 19 డిసెంబర్ 2025

 

➖ *విజయవాడ ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి.*

 

➖ శ్రీ అమ్మవారి దర్శనముకు వెళ్లే ముందు భక్తులతో మాట్లాడిన మంత్రి.

ఆన్ లైన్ సేవలు, భక్తుల సంతృప్తి స్థాయి తెలుసుకున్న మంత్రి.

అన్ని ఏర్పాట్లు బాగున్నాయని తెలిపిన భక్తులు.

 

    ➖మంత్రివర్యులకు వేద మంత్రాలు, మంగళవాయిధ్యాల నడుమ స్వాగతం పలికిన ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధా కృష్ణ (గాంధీ), ఈవో శీనా నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు.

శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు.

 

➖ *అనంతరం* ఈవో ఛాంబర్లో - దేవాలయంలో నగదు రహిత సేవల స్థాయి, ఐవిఆర్ ఎస్ కాల్స్ ద్వారా భక్తుల సంతృప్తి స్థాయి, ఆన్ లైన్ సేవలు పెంపుదల గురించి ఆలయ ఈవో నుండి వివరాలు తెలుసుకున్న మంత్రివర్యులు.

➖గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల ప్రకారం పూర్తి స్థాయిలో ఆన్ లైన్ సేవలు భక్తులకు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు శ్రీ బడేటి ధర్మారావు, శ్రీ పి. రాఘవ రాజు, శ్రీ ఎ. శ్రీనివాసరావు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ వెలగపూడి శంకరబాబు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు మండలాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది
పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో గురువారం ఉదయం చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ప్రజలు చలికి...
By Kothuru Murali 2025-12-26 06:49:26 0 151
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్క్క:పై కొడవలితో దాడి తమ్ముడు అరెస్ట్
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామపంచాయతీ బోయకొండ యానాదిపాలెంలో బుధవారం దారుణ...
By Kothuru Murali 2026-02-12 05:38:57 0 86
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com