Ayyanna Patrudu: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... కీలక నిర్ణయం తీసుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు!

0
18

ఇకపై డిజిటల్ విధానంలోనే ఎమ్మెల్యేల హాజరు నమోదు చేయాలని నిర్ణయించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరై, మిగతా సమావేశాలకు దూరంగా ఉంటున్న వైనం 

కొందరు సభ్యులు హాజరు రిజిస్టర్‌పై సంతకం చేసి వెంటనే వెళ్లిపోతున్నారని ఆరోపణలు 

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేల వరుస గైర్హాజరుపై శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై డిజిటల్ విధానంలోనే ఎమ్మెల్యేల హాజరు నమోదు చేయాలని నిర్ణయించారు. సభకు హాజరుకాకుండా కొందరు సభ్యులు జీతాలు తీసుకోవడం, ఎమ్మెల్యేలుగా కొనసాగడం ఎంత వరకు సబబని స్పీకర్ ఇప్పటికే పలుమార్లు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు ఉన్న విచక్షణాధికారాలతో హాజరు విధానంపై కఠిన నిర్ణయం తీసుకున్నారు.

 

అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పటి వరకు వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరై, మిగతా సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. వరుసగా 60 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు గైర్హాజరైతే అనర్హత వేటు వేయొచ్చని చట్టంలో నిబంధన ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరైతే అది సమావేశాలకు హాజరైనట్టు పరిగణనలోకి రాదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

 

ఈ నేపథ్యంలో గతంలో కొందరు సభ్యులు హాజరు రిజిస్టర్‌పై సంతకం చేసి వెంటనే వెళ్లిపోతున్నారని ఆరోపణలు రావడంతో అలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకే డిజిటల్ హాజరు విధానాన్ని స్పీకర్ అమలు చేయాలని నిర్ణయించారు. కాగా, ఈరోజు గవర్నర్ ప్రసంగం తర్వాత జరిగే బీఏసీ సమావేశంలో సభ ఎన్నిరోజులు నిర్వహించాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. 

Search
Categories
Read More
Telangana
రాజీవ్ గృహకల్పలో విద్యుత్ సెగ- మాజీ ఎమ్మెల్యేను ఆశ్రయించిన కాలనీవాసులు.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  కుత్బుల్లాపూర్ : జగద్గిరిగుట్ట రాజీవ్...
By Sidhu Maroju 2025-12-29 16:04:15 0 77
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు ప్రముఖ పుణ్యక్షేత్రం బోయ కొండలో క్యూఆర్ కోడ్ స్కానర్లు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో మంగళవారం మధ్యాహ్నం ఆలయ ఉప...
By Kothuru Murali 2026-02-11 08:42:59 0 29
Andhra Pradesh
సంక్రాంతికి ఊరెళ్లే వారికి భారీ గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లపై క్లారిటీ.. ఈ సారి ఎన్నంటే..?
సంక్రాంతికి సొంతూరు వెళ్లేవారికి గుడ్ న్యూస్. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ...
By SivaNagendra Annapareddy 2025-12-21 14:34:06 0 116
Andhra Pradesh
అమరావతిపై విషం కక్కుతున్న వైకాపా టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్
*అమరావతిపై విషం కక్కుతున్న వైకాపా*   *టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్*  ...
By Rajini Kumari 2026-01-11 09:39:58 0 85
Andhra Pradesh
గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి హిందూ కాలేజీ నందు సంకల్పం కార్యక్రమం విద్యార్థులతో చేపట్టినారు.
లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని హిందూ కాలేజీ నందు ఈరోజు సంకల్పం కార్యక్రమం ఏర్పాటు చేయడం...
By KOTESWARARAO KVSR 2025-12-29 14:19:25 0 139
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com