Kandula Durgesh: ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ.. పోలీసుల అప్రమత్తం.

0
156

సచివాలయంలోని కందుల దుర్గేశ్ పేషీకి లేఖ

దుర్గేశ్ తో పాటు కుటుంబ సభ్యులను కూడా చంపేస్తామని హెచ్చరిక

మంత్రికి భద్రతను పెంచే అవకాశం

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌కు మావోయిస్టుల పేరుతో వచ్చిన బెదిరింపు లేఖ తీవ్ర సంచలనం రేపుతోంది. అత్యంత భద్రత కలిగిన రాష్ట్ర సచివాలయంలోని మంత్రి పేషీకే ఈ లేఖ నేరుగా చేరడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.

 

 

 

నిషేధిత మావోయిస్టు పార్టీ పేరుతో వచ్చిన ఈ లేఖలో మంత్రి దుర్గేశ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా హతమారుస్తామని తీవ్ర హెచ్చరికలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి కార్యాలయ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

 

 

 

పోలీసులు ప్రస్తుతం రెండు ప్రధాన కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ లేఖ నిజంగానే మావోయిస్టులు పంపించారా? లేక ఎవరైనా ఆకతాయిలు లేదా రాజకీయ ప్రత్యర్థులు మావోయిస్టుల పేరును ఉపయోగించి బెదిరింపులకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. లేఖ ఎక్కడి నుంచి పోస్టు చేశారు? సచివాలయంలోకి అది ఎలా చేరింది? అన్న విషయాలపై సీసీటీవీ ఫుటేజ్, పోస్టల్ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా లేఖపై ఉన్న హ్యాండ్‌ రైటింగ్, ఫింగర్ ప్రింట్స్ తదితర అంశాలను విశ్లేషిస్తున్నట్లు సమాచారం.

 

 

 

 

ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేశ్‌కు భద్రతను మరింత పెంచే అవకాశముందని తెలుస్తోంది. ఆయన నివాసం, కార్యాలయం, పర్యటనల సమయంలో పోలీసు పహారా పెంచాలని ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే మావోయిస్టు కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉన్న భద్రతా యంత్రాంగం, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని లోతైన విచారణ చేపట్టింది.

Search
Categories
Read More
SURAKSHA
Ravi Shankar Ayyanar: A Leader Redefining Modern Policing
The Visionary in Khaki: The Unwavering Journey of Shri Ravi Shankar Ayyanar, IPS Bridging...
By Kalaga Sailaja 2026-07-13 10:47:46 0 60
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:సదుం మండలంలో పర్యటించిన ఎన్సీడీసీ జాయింట్ డైరెక్టర్
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో ఎన్సీడీసీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ ఆదివారం పర్యటించారు. బర్డ్...
By Kothuru Murali 2026-02-16 11:35:12 0 188
Puducherry
Puducherry Boost: JIPMER Cancer Centre & University Upgrades
Puducherry is undergoing significant infrastructure revitalization with major development...
By Lokeshwari Panthadi 2026-06-29 04:54:55 0 76
Andhra Pradesh
మాధవపట్నం వంతెన వద్ద రోడ్డు ప్రమాదం – మహిళకు తీవ్ర గాయాలు
సామర్లకోట మండలంలోని మాధవపట్నం వంతెన సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా...
By Ratna Sekhar 2026-02-19 14:26:16 0 398
SURAKSHA
Andhra Pradesh Police Implements Community Service Sentences for Minor Offenses
Many minor offenders, especially first-timers or youth, often struggle to find employment after...
By Kalaga Sailaja 2026-06-30 12:32:10 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com