అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భద్రతా మరియు బందోబస్తు నిర్వహణపై గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులతో కలసి హాజరైన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు,.

0
40

🚩 నేటి నుంచి (11.02.2026) ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన శాంతి భద్రతలు, భద్రతా ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై సమీక్షించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీనియర్ పోలీస్ అధికారులు (ఐపీఎస్ అధికారులు) పాల్గొని, శాసనసభ పరిసరాల్లో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, భద్రతా చర్యలపై చర్చించారు.

📍ఈ సమావేశానికి గౌరవ శాసన సభ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారు, రాష్ట్ర డీజీపీ శ్రీ హరిష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ గారు, గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి, ఐపీఎస్ గారు, గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారు, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్, ఐపీఎస్ గారు, శ్రీ ఎ. మురళి గారు – చీఫ్ మార్షల్, శాసనమండలి, శ్రీ వి. గణేష్ గారు – చీఫ్ మార్షల్, శాసనసభ మొదలగు వారు హాజరైనారు.

📍అలాగే ఇతర సంబంధిత అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని గౌరవ స్పీకర్ గారు సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అటల్ బిహారీ వాజ్పేయి గారిని కొనియాడిన దేవినేని ఉమామహేశ్వరరావు
ప్రజామన్ననలు పొందిన నాయకులు అటల్ బిహారీ వాజ్ పేయి ... సమర్థ నాయకత్వంతో సుపరిపాలన అందించారు...
By Rajini Kumari 2025-12-25 11:06:02 0 139
Telangana
దీక్ష దివస్ ను పురస్కరించుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  ఈరోజు “దీక్ష దివస్”ను పురస్కరించుకొని మల్కాజ్గిరి...
By Sidhu Maroju 2025-11-29 11:39:25 0 99
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com