మదనపల్లె: క్వారీ గుంతలో పడి బాలుడు గల్లంతు.. ముమ్మరంగా గాలింపు.

0
114

మదనపల్లి మండలం పోతపోలు గ్రామ పరిధిలోని జబ్బల క్వారీ గుంతలో 14 ఏళ్ల మహమ్మద్ అన్నాస్ ప్రమాదవశాత్తు పడి సోమవారం ఉదయం గల్లంతయ్యాడు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక అధికారి శివప్ప తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. క్వారీ గుంతలో నీరు ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక పరికరాలతో శోధన కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు బాలుడి ఆచూకీ లభించలేదని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. బాలుడి కుటుంబ సభ్యులు ఘటనా స్థలంలో ఆందోళనకు గురవుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చిత్తూరు: పాలిటెక్నిక్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానం: కలెక్టర్
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పుంగనూరు సమీపంలోని అగ్నిగొండిపల్లి గ్రామంలో...
By Kothuru Murali 2026-05-15 15:40:51 0 41
Telangana
జిల్లా ప్రజలకు కలెక్టర్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు;
నిర్మల్ జిల్లా ప్రజలకు, అధికారులకు కలెక్టర్ అభిలాష అభినవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ...
By Mittapelli Saketh 2026-01-01 11:12:20 0 422
Andhra Pradesh
జాఫర్, రమేష్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ
అయ్యప్ప సేవా సమితి సేవలు అదర్శనీయం మజ్జిగ పంపిణీ చేసిన జాఫర్.రమేష్ నందిగామ,ఏప్రిల్,20,(భారత్...
By Patan Khuddus 2026-04-21 06:51:01 0 240
Andhra Pradesh
తిరుమల అన్నప్రసాద సేవపై విదేశీయుడి భక్తుడి ప్రశంసలు
తిరుమల శ్రీవారి అన్నప్రసాద వితరణను చూసి ఓ విదేశీయుడు ఆశ్చర్యపోయాడు. రోజూ లక్ష మందికి పైగా...
By Pagadala Venkateswar 2026-01-13 07:21:39 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com