Nara Lokesh: క్వాంటం వ్యాలీతో వచ్చే ఉద్యోగాలివే.. భవిష్యత్ టెక్నాలజీపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన.

0
129

అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీ ఎలాంటి ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలను సృష్టించబోతోందో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టత ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా క్వాంటం ఇంజనీర్లు, అడ్వాన్స్‌డ్ ఏఐ నిపుణులు, కంప్యూటింగ్ స్పెషలిస్టులు, చిప్ డిజైనర్లు, క్రయోజెనిక్స్ ఎక్స్‌పర్టులు, ఆర్‌ఎఫ్ ఇంజనీర్లతో పాటు డీప్ టెక్ పరిశోధకులకు భారీ స్థాయిలో అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు. శనివారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అమరావతిలో క్వాంటం వ్యాలీకి భూమిపూజ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా యువతకు కేవలం ఉద్యోగాలు ఇవ్వడమే కాదని, అవి 'ఫ్యూచర్ ప్రూఫ్' ఉద్యోగాలని ఆయన నొక్కి చెప్పారు.

 

అమరావతి కేవలం పరిపాలనా రాజధానిగానే పరిమితం కాదని, ఇది సైన్స్, కంప్యూటేషన్, ఇన్నోవేషన్ రాజధానిగా రూపాంతరం చెందబోతోందని లోకేశ్ ప్రకటించారు. "మన యువత అత్యాధునిక సాంకేతికతను కేవలం ఉపయోగించే వారుగా కాకుండా, దానిని సృష్టించే నిర్మాతలుగా మారాలన్నదే మా లక్ష్యం. క్వాంటం, డీప్ టెక్, ఏఐ వంటివి అమరావతి కొత్త గుర్తింపును నిర్వచిస్తాయి. ఇది ప్రపంచ స్థాయి ప్రతిభను ఆకర్షించే నగరంగా, అత్యాధునిక టెక్నాలజీని ప్రపంచానికి ఎగుమతి చేసే కేంద్రంగా మారుతుంది" అని ఆయన పేర్కొన్నారు.

 

ఒకప్పుడు విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో హైదరాబాద్ ఐటీ విప్లవానికి ఎలా నాయకత్వం వహించిందో, ఇప్పుడు అదే స్ఫూర్తితో అమరావతి భారతదేశ క్వాంటం విప్లవానికి నేతృత్వం వహించబోతోందని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో భాగంగా ఐబీఎం, టీసీఎస్, ఎల్&టీ వంటి 14 ప్రఖ్యాత సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు (MoU) కుదుర్చుకున్నాయని వెల్లడించారు. ఇండస్ట్రీ, అకాడెమియా, స్టార్టప్‌ల భాగస్వామ్యంతో తదుపరి సాంకేతిక శకానికి ఏపీ నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.

 

భారతదేశంలోనే మొట్టమొదటి నేషనల్ క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ అమరావతిలో ఏర్పాటవుతోందని లోకేశ్ తెలిపారు. సూపర్‌ కండక్టింగ్, ఫోటానిక్, ఐయాన్ ట్రాప్ వంటి బహుళ ప్లాట్‌ఫారమ్‌లు ఇక్కడ అభివృద్ధి కానున్నాయని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే 50 వేల మంది విద్యార్థులు ఈ నూతన సాంకేతికతలపై శిక్షణ పొందుతున్నారని, దీర్ఘకాలంలో 10 లక్షల మంది యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన ఐబీఎం, టీసీఎస్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, క్యూపీఏఐ వంటి సంస్థలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దిగ్గజ సంస్థల రాక, ప్రపంచ స్థాయి పరిశ్రమలు అమరావతిపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని లోకేశ్ పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రసాయనాలతో తిరుమల లడ్డు ప్రసాదం తయారు చేసి వైసిపి మహాపరాధం చేసింది
రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేసి వైసీపీ మహాపరాధం చేసింది   • సిట్ నివేదికలో...
By Chennaiah Kati 2026-02-04 09:59:13 0 179
Karnataka
ಎ.ಬಿ.ವಿ.ಪಿ. ರಥಯಾತ್ರೆಯಲ್ಲಿ ಗೃಹ ಸಚಿವರ ಭಾಗವಹಿಸುವಿಕೆ: ರಾಜಕೀಯ ವಿವಾದ
ಟಿಪ್ಟೂರಿನಲ್ಲಿ ಆಯೋಜಿಸಲಾದ ಎ.ಬಿ.ವಿ.ಪಿ. ರಥಯಾತ್ರೆಯಲ್ಲಿ ಗೃಹ ಸಚಿವ ಜಿ. ಪರಮೇಶ್ವರ ಅವರ ಭಾಗವಹಿಸುವಿಕೆ ಸಾಕಷ್ಟು...
By Pooja Patil 2025-09-11 09:30:12 0 229
Andhra Pradesh
అమ్మ చెరువుమిట్టలో మందుబాబుల వీరంగం: బస్సు సిబ్బందిపై దాడి.
మదనపల్లె పట్టణంలో మంగళవారం కదిరి రోడ్డులోని అమ్మ చెరువుమిట్ట వద్ద ముగ్గురు యువకులు మద్యం సేవించి...
By Pagadala Venkateswar 2026-04-22 03:03:54 0 67
Andhra Pradesh
ఎన్నికల హామీలను అమలు చేయాలి
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అకాడమిక్...
By Boiena Rajesh 2026-03-16 03:50:12 0 148
Andhra Pradesh
ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు
కర్నూలు : తెలుగుదేశం పార్టీలో లోక్ సభ నియోజకవర్గ (జిల్లా) అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను...
By Hari Krishna 2025-12-21 09:30:04 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com