Nara Lokesh: క్వాంటం వ్యాలీతో వచ్చే ఉద్యోగాలివే.. భవిష్యత్ టెక్నాలజీపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన.

0
165

అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీ ఎలాంటి ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలను సృష్టించబోతోందో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టత ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా క్వాంటం ఇంజనీర్లు, అడ్వాన్స్‌డ్ ఏఐ నిపుణులు, కంప్యూటింగ్ స్పెషలిస్టులు, చిప్ డిజైనర్లు, క్రయోజెనిక్స్ ఎక్స్‌పర్టులు, ఆర్‌ఎఫ్ ఇంజనీర్లతో పాటు డీప్ టెక్ పరిశోధకులకు భారీ స్థాయిలో అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు. శనివారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అమరావతిలో క్వాంటం వ్యాలీకి భూమిపూజ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా యువతకు కేవలం ఉద్యోగాలు ఇవ్వడమే కాదని, అవి 'ఫ్యూచర్ ప్రూఫ్' ఉద్యోగాలని ఆయన నొక్కి చెప్పారు.

 

అమరావతి కేవలం పరిపాలనా రాజధానిగానే పరిమితం కాదని, ఇది సైన్స్, కంప్యూటేషన్, ఇన్నోవేషన్ రాజధానిగా రూపాంతరం చెందబోతోందని లోకేశ్ ప్రకటించారు. "మన యువత అత్యాధునిక సాంకేతికతను కేవలం ఉపయోగించే వారుగా కాకుండా, దానిని సృష్టించే నిర్మాతలుగా మారాలన్నదే మా లక్ష్యం. క్వాంటం, డీప్ టెక్, ఏఐ వంటివి అమరావతి కొత్త గుర్తింపును నిర్వచిస్తాయి. ఇది ప్రపంచ స్థాయి ప్రతిభను ఆకర్షించే నగరంగా, అత్యాధునిక టెక్నాలజీని ప్రపంచానికి ఎగుమతి చేసే కేంద్రంగా మారుతుంది" అని ఆయన పేర్కొన్నారు.

 

ఒకప్పుడు విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో హైదరాబాద్ ఐటీ విప్లవానికి ఎలా నాయకత్వం వహించిందో, ఇప్పుడు అదే స్ఫూర్తితో అమరావతి భారతదేశ క్వాంటం విప్లవానికి నేతృత్వం వహించబోతోందని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో భాగంగా ఐబీఎం, టీసీఎస్, ఎల్&టీ వంటి 14 ప్రఖ్యాత సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు (MoU) కుదుర్చుకున్నాయని వెల్లడించారు. ఇండస్ట్రీ, అకాడెమియా, స్టార్టప్‌ల భాగస్వామ్యంతో తదుపరి సాంకేతిక శకానికి ఏపీ నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.

 

భారతదేశంలోనే మొట్టమొదటి నేషనల్ క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ అమరావతిలో ఏర్పాటవుతోందని లోకేశ్ తెలిపారు. సూపర్‌ కండక్టింగ్, ఫోటానిక్, ఐయాన్ ట్రాప్ వంటి బహుళ ప్లాట్‌ఫారమ్‌లు ఇక్కడ అభివృద్ధి కానున్నాయని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే 50 వేల మంది విద్యార్థులు ఈ నూతన సాంకేతికతలపై శిక్షణ పొందుతున్నారని, దీర్ఘకాలంలో 10 లక్షల మంది యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన ఐబీఎం, టీసీఎస్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, క్యూపీఏఐ వంటి సంస్థలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దిగ్గజ సంస్థల రాక, ప్రపంచ స్థాయి పరిశ్రమలు అమరావతిపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని లోకేశ్ పేర్కొన్నారు.

Search
Categories
Read More
Business & Finance
Adding Directors? Avoid These Costly Registration Mistakes
Adding a director to a company is a legal process that requires compliance with the Companies Act...
By Navya Sree 2026-07-09 06:41:39 0 75
Andhra Pradesh
పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ
బొబ్బిలి షాదీఖానాలో హుదా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం పేద ముస్లింలకు ఎమ్మెల్యే...
By Boiena Rajesh 2026-03-14 12:08:41 0 209
Andhra Pradesh
బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో తనిఖీ
బాపట్ల: తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో గ్లోరియా శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కార్యాలయ...
By Gadiyapudi Narendra 2026-02-21 16:25:50 0 181
Andhra Pradesh
పెద్దాపురం పురపాలికకు స్పెషల్ గ్రేడ్ హోదా
చరిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన పెద్దాపురం పురపాలికకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ హోదా మంజూరు...
By Ratna Sekhar 2026-03-11 07:59:46 0 1K
Andhra Pradesh
లోన్ కట్టలేదని వేధిస్తే బ్యాంకులపై కఠిన చర్యలు- సుప్రీంకోర్టు వార్నింగ్
*సామాన్యులకు అర్థమయ్యేలా*: చాలా మంది బ్యాంకుల్లో {లేదా} ఫైనాన్స్ యాప్‌ లులో లోన్...
By John Baji 2026-02-05 02:38:10 0 452
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com