డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: 8 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా

0
173

చీరాల: చీరాల ఒకటో పట్టణ ట్రాఫిక్ ఇంచార్జి ఎస్సై పవన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన పలువురిని పోలీసులు గుర్తించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వాళ్లని చీరాల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసులను పరిశీలించిన మెజిస్ట్రేట్, నిబంధనలను ఉల్లంఘించిన ఎనిమిది మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించారు.

ఈ సందర్భంగా, ఎస్ఐ, పవన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రజల ప్రాణాల భద్రత కోసమే ఇటువంటి తనిఖీలు కఠినంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడే వాళ్లపై ఇకపై కూడా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రజలు తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవాలంటే ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
జింక అడ్డొచ్చి ప్రమాదం.. తల్లి, ఇద్దరు కుమార్తెలకు గాయాలు.
మదనపల్లె టౌన్ పరిధిలో సోమవారం జరిగిన ఘటనలో, ములకలచెరువు మండలం తుమ్మనగుట్టకు చెందిన భారతి (35) తన...
By Pagadala Venkateswar 2026-04-27 06:07:40 0 93
Business & Finance
Gold Prices Remain High Across Delhi Markets
Gold prices continued to trade at elevated levels across Delhi, with jewellers, bullion traders,...
By Navya Sree 2026-07-03 05:58:34 0 54
SURAKSHA
Pronab Mohanty, IPS: Leading Karnataka with Courage & Vision
A distinguished 1994-batch Karnataka cadre IPS officer whose leadership, integrity, and...
By Lokeshwari Panthadi 2026-07-18 11:43:43 0 43
Andhra Pradesh
అనధికార లేఅవుట్ల యజమానులకు రెండో నోటీసులు.
పలమనేరు–కుప్పం–మదనపల్లె పట్టణాభివృద్ధి సంస్థ (పీకేఎం ఉడా) పరిధిలోని అనధికార...
By Pagadala Venkateswar 2026-06-19 04:45:50 0 82
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల :
కర్నూలు : *ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల నోటిఫికేషన్*ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుల ఎన్నికలు 13...
By Hari Krishna 2026-01-03 16:20:38 0 252
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com