డ్రగ్స్ రహిత సమాజమే మా లక్ష్యం

0
126

*ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ*

 

*పత్రికా ప్రకటన* *తేదీ.07.02.2026*

 

*🔴 డ్రగ్స్‌ రహిత సమాజమే మా లక్ష్యం - ఎన్‌టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ శ్రీ.ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు.*

 

*🔴ఎన్‌టీఆర్ జిల్లా పరిధిలో డ్రగ్స్‌ / గంజాయి వినియోగం పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలతో పాటు మానవతా దృక్పథంతో కూడా ముందుకు సాగుతోంది.*

 

*🔴ప్రజలకు ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియజేయునది ఏమనగా మీ పిల్లలు గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు మీకు అనుమానం కలిగినా లేదా నిర్ధారణ అయినా, వెంటనే ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ అధికారులను సంప్రదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.*

 

*🔴ముందుగానే పోలీసులను సంప్రదిస్తే గంజాయి మానేందుకు అవసరమైన కౌన్సెలింగ్ & ట్రీట్మెంట్ అందించబడుతుంది, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తగిన సహాయం, మార్గదర్శనం చేయబడుతుంది*

 

*🔴అయితే గంజాయి లేదా డ్రగ్స్‌ వినియోగం / రవాణా / విక్రయం వంటి నేరాలలో పోలీసులకు చిక్కినట్లయితే, చట్టప్రకారం ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.*

 

*🔴డ్రగ్స్‌ రహిత భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, సమాజం అందరూ పోలీస్ వారితో సహకరించాలని ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ వారు విజ్ఞప్తి చేస్తున్నారు.*

Search
Categories
Read More
Andhra Pradesh
విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం: మంత్రి గొట్టిపాటి.
AP: వచ్చే మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఇప్పటికే...
By Pagadala Venkateswar 2026-01-24 06:39:18 0 130
Andhra Pradesh
నందిగామలో కోనేరుకు పూర్వ వైభవం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ
నందిగామ,పాత బస్టాండ్ లో ఉన్నటువంటి పురాతనమైన కోనేరు పుష్కరిణి చుట్టూతా ఉన్న ఆక్రమణలను హైకోర్టు...
By Patan Khuddus 2026-04-29 15:32:50 0 242
Andhra Pradesh
మదనపల్లిలో ఆటోలపై స్పెషల్ డ్రైవ్.
మదనపల్లి జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి అశోక్ ప్రతాప్ రావు ఆధ్వర్యంలో అమ్మ చెరువు మిట్ట వద్ద...
By Pagadala Venkateswar 2026-02-28 07:24:48 0 110
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com