Ayyanna Patrudu: సభకు రాకుండా రోడ్లపై మాట్లాడతారేంటి?: స్పీకర్ అయ్యన్నపాత్రుడు.

0
93

రాష్ట్రం, ప్రజల పక్షాన నిజంగా చర్చించాలనుకుంటే వారు సభకు రావాలన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు

సభలో లేవనెత్తే ప్రతి అంశానికి మంత్రుల ద్వారా సమాధానం ఇప్పించడం తన బాధ్యతని వెల్లడి

 

మీడియా సమాజహితం కోసం పనిచేయాలని సూచన

 

శాసనసభకు గైర్హాజరువుతున్న వైసీపీ ఎమ్మెల్యేలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చర్చలు జరగకుండా.. రోడ్లపై మాత్రమే విమర్శలు, ప్రతికూల వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రం, ప్రజల పక్షాన నిజంగా చర్చించాలనుకుంటే వారు సభకు రావాలని సూచించారు. సభలో లేవనెత్తే ప్రతి అంశానికి మంత్రుల ద్వారా సమాధానం ఇప్పించడం తన బాధ్యతని స్పష్టం చేశారు. 

 

రోడ్లపై జరుగుతున్న ఈ గుద్దులాట సంస్కృతి ఏంటో అర్థం కావడం లేదని స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీనే సరైన వేదిక అని అన్నారు. ఇదే సమయంలో నో వర్క్.. నో పే విధానంపై అయ్యన్న మరోసారి స్పందించారు. ఈ విధానాన్ని ఎమ్మెల్యేలకూ అమలు చేయాలని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధంగా ఇందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. 

 

 

 

ప్రస్తుత రాజకీయ వాతావరణంలో తనలాంటి మనస్తత్వం ఉన్నవారికి రాజకీయాలు సూట్ కావడం లేదని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని అనుకున్నానని, ఇంకా కొనసాగిస్తే గౌరవం కూడా మిగిలే పరిస్థితి ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా విశాఖలో భూముల ధరలు పెరగడం, గతంలో రేట్లు తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి ఫిర్యాదులు లేకపోవడం వంటి అంశాలపై కూడా ఆయన స్పందించారు. పాత్రికేయుల బాధ్యతలపై ప్రస్తావిస్తూ.. మీడియా సమాజహితం కోసం పనిచేయాలని సూచించారు. వక్రీకరణల ద్వారా అసలు విషయం పక్కదారి పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కేంద్ర మంత్రి వి. సోమన్న సహకారంతో హిందూపురంలో వందే భారత్ నిలుపుదల: పచ్చజెండా ఊపిన ఎంపీ పార్థసారథి మరియు ప్రముఖులు
హిందూపురం ప్రాంత ప్రజల చిరకాల విజ్ఞప్తిని మన్నిస్తూ, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ వి....
By Venugopal Gopal 2025-12-27 09:52:45 0 2K
Andhra Pradesh
రాష్ట్రవ్యాప్తంగా హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమం
*For Scrolls*   *చీపురుపల్లి*   *రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్...
By Rajini Kumari 2026-02-28 12:44:31 0 96
Telangana
నూతన రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : అల్వాల్‌ వెంకటాపురం డివిజన్‌లో రూ.50 లక్షల వ్యయంతో సీసీ...
By Sidhu Maroju 2025-11-28 05:22:34 0 149
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:టమోటా లోడ్ ట్రక్ బోల్తా
సోమల చౌడేపల్లి మార్గంలో టమోటా లోడ్ తో వెళ్తున్న ట్రక్ శుక్రవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో...
By Kothuru Murali 2026-03-20 06:34:17 0 87
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com