Municipal Commissioners Transfers Andhra Pradesh: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు.

0
162

అనంతపురం మున్సిపల్ కమిషనర్‌గా ఎం. జస్వంత్‌రావు నియామకం

 

రాష్ట్రవ్యాప్తంగా పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పలు మున్సిపాలిటీలు, యూడీఏలు, కార్పొరేషన్లలో కీలక అధికారుల మార్పులు చేపట్టింది. 

 

అనంతపురం మున్సిపల్ కమిషనర్‌గా ఎం. జస్వంత్‌రావును నియమించగా.. అక్కడ పనిచేస్తున్న బి. బాలస్వామిని విజయనగరానికి బదిలీ చేశారు. పల్నాడు యూడీఏ కార్యదర్శిగా ఉన్న జి. సాంబశివరావును గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో డిప్యూటీ కమిషనర్‌గా నియమించారు. గుంటూరులో ఉన్న టి. వెంకటకృష్ణయ్యను పల్నాడు యూడీఏ సెక్రటరీగా నియమించారు. 

 

గుంతకల్ కమిషనర్‌గా పనిచేస్తున్న సీఎంఏ నయీం అహ్మద్‌ను ఆదోనికి బదిలీ చేయగా.. అక్కడ ఉన్న కృష్ణను సీఆర్‌డీఏకు పంపించారు. ఏలూరు యూడీఏ కార్యదర్శిగా వెయిటింగ్‌లో ఉన్న పి. సింహాచలంను నియమించారు. ఒంగోలు యూడీఏ కార్యదర్శిగా ఉన్న ఆర్‌ చండి దేవసేనను తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో అసిస్టెంట్ కమిషనర్‌గా బదిలీ చేశారు.  

 

విజయవాడలో శానిటరీ ఇన్స్‌పెక్టర్‌‌గా ఉన్న కె. శివరామ్‌ప్రసాద్‌ను వినుకొండ కమిషనర్‌గా నియమించారు. వినుకొండలో శానిటరీ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్న ఎం. సుభాష్ చంద్రబోస్‌ను సీడీఎంఏకు రిపోర్టు చేయాలని ఆదేశించారు. అలాగే, కల్యాణదుర్గంలో శానిటరీ ఇన్స్‌పెక్టర్‌‌గా ఉన్న ఎస్‌. నూర్ అలీఖాన్‌ను కమలాపురం నగరపంచాయతీ కమిషనర్‌గా నియమించారు. అక్కడ పనిచేస్తున్న ప్రహ్లాద్‌ను సీడీఎంఏకు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రెవెన్యూ రికార్డులు డిజిలైజేషన్లో ఏఐవినియోగంపై ప్రజెంటేషన్ ఇచ్చిన అనంతపురం కలెక్టర్ ఆనంద్
అమరావతి   రెవెన్యూ రికార్డుల డిజిటైజేషన్లో ఏఐ వినియోగంపై ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చిన...
By Rajini Kumari 2025-12-18 10:15:51 0 159
Telangana
దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ పెద్దపల్లి ఆధ్వర్యంలో యస్ ఐ ఆర్ మ్యాపింగ్ క్యాంప్.
తేది 04-04-2026, శనివారం ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు, స్థానిక సయ్యద్ నబీ...
By MOHAMMAD MUJEEBUDDIN 2026-04-04 10:17:18 0 143
Telangana
మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ గారి తక్షణ స్పందన
మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ గారి తక్షణ స్పందన  మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని...
By Pinnehasan Odela 2026-03-08 14:12:04 0 121
Andhra Pradesh
రైతులకు ఆర్థిక సహాయం : మంత్రి అచ్చెన్నాయుడు
కర్నూలు : కోడుమూరు :  కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు టౌన్ లో ఉల్లిగడ్డ రైతులకు...
By Hari Krishna 2026-01-03 14:26:39 0 190
Telangana
సూరారం పోలీసుల 'క్రైమ్ ఆపరేషన్' - లక్షల నగదు రికవరీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి మొబైల్ ని దొంగిలించి...
By Sidhu Maroju 2026-02-03 14:18:38 0 130
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com