సముద్రంలో విద్యార్థుల గల్లంతు* పుట్టినరోజు వేడుకలో భాగంగా సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు స్నేహితులు...

0
115

చిన్నగంజాం: పుట్టినరోజు వేడుకలో భాగంగా సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు స్నేహితులు ఇద్దరు విద్యార్థుల గల్లంతు, ఇద్దరు క్షేమం రెవిన్యూ, పోలీస్, మెరైన్, అగ్నిమాపక శాఖ గాలింపు చర్యలు పుట్టినరోజు వేడుకలు ఆ కుటుంబంలో విషాదం నింపాయి. సరదాగా గడపటానికి వెళ్లిన నలుగురిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు కాగా, ఇద్దరు క్షేమంగా ఓడినే ఉన్నారు. చిన్నారుల గల్లంతుతో ఆయా కుటుంబాలు విషాదంతో వేదనకు గురవుతున్నారు.

 
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం,
పర్చూరు నియోజకవర్గం దుద్దుకూరు గ్రామానికి చెందిన చందులూరి శ్రీరామ్ (15) పుట్టినరోజు సందర్భంగా దుద్దుకూరు జడ్పీ హైస్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న తోటి స్నేహితులు బిక్కి అవినాష్, తాటిపర్తి హేమంత్, గుంజి హేమవర్ధన్ నలుగురు విద్యార్థులు గురువారం సాయంత్రం మూడు గంటల సమయంలో ఒక బైక్ మీద చిన్నగంజాం మండలం బాపయనగర్ బీచ్ దగ్గర సముద్రంలో మునగడానికి వెళ్లారు. అవినాష్, శ్రీరామ్ ఇద్దరు సముద్రంలో నీట మునిగి ఆచూకీ తెలియలేదు. హేమంత్, హేమ వర్ధన్ సముద్రం ఒడ్డునే ఉండటంతో క్షేమంగా ఉన్నారు. సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు, స్థానిక పోలీస్, రెవిన్యూ, అగ్నిమాపక శాఖ అధికారుల సమన్వయంతో ఆచూకీ లేకుండా పోయిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో జిల్లాలోని తీర ప్రాంతం ఉలిక్కిపడింది. విద్యార్థులు గల్లంతు కావడం పట్ల స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
 
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
గోవులకు చిరు ధాన్యములు . అరటి పండ్లు ఆకు కూరలు తినిపించిన మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్
విశాఖ పట్నం సమీపం  శొంటి  యం దగ్గర ఉన్న గో హాస్టల్  లో ఈ రోజు సాయంకా లం 4...
By Mobbu Venkatramana 2026-03-31 15:59:59 0 63
Andhra Pradesh
మదనపల్లిలో బీజేపీ శిక్షణ మహాభియాన్ ప్రారంభం.
మదనపల్లిలోని కృష్ణ కళ్యాణ మండపంలో “పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ...
By Pagadala Venkateswar 2026-02-21 11:13:20 0 101
Andhra Pradesh
మదనపల్లె: మహిళా రైతుపై తేనెటీగల దాడి.. తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలోని కోటవారిపల్లిలో మంగళవారం మహిళా రైతు సిద్ధమ్మ (59)పై తేనెటీగలు దాడి చేశాయి....
By Pagadala Venkateswar 2026-03-25 02:54:31 0 86
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఆలయ సందర్శన మరియు సరస్వతి హోమం కార్యక్రమంలో పాల్గొన్న...
By Rajini Kumari 2026-01-23 12:15:18 0 195
Telangana
గ్యాస్‌ సిలిండర్ల మార్కెట్‌లో అధిక ధరలకు రూ. 3,500 నుంచి 4 వేలు
రూ. 3,500 నుంచి 4 వేలు హైదరాబాద్‌ మహా నగరంలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా...
By Pinnehasan Odela 2026-03-12 11:18:13 0 110
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com