సముద్రంలో విద్యార్థుల గల్లంతు* పుట్టినరోజు వేడుకలో భాగంగా సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు స్నేహితులు...

0
116

చిన్నగంజాం: పుట్టినరోజు వేడుకలో భాగంగా సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు స్నేహితులు ఇద్దరు విద్యార్థుల గల్లంతు, ఇద్దరు క్షేమం రెవిన్యూ, పోలీస్, మెరైన్, అగ్నిమాపక శాఖ గాలింపు చర్యలు పుట్టినరోజు వేడుకలు ఆ కుటుంబంలో విషాదం నింపాయి. సరదాగా గడపటానికి వెళ్లిన నలుగురిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు కాగా, ఇద్దరు క్షేమంగా ఓడినే ఉన్నారు. చిన్నారుల గల్లంతుతో ఆయా కుటుంబాలు విషాదంతో వేదనకు గురవుతున్నారు.

 
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం,
పర్చూరు నియోజకవర్గం దుద్దుకూరు గ్రామానికి చెందిన చందులూరి శ్రీరామ్ (15) పుట్టినరోజు సందర్భంగా దుద్దుకూరు జడ్పీ హైస్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న తోటి స్నేహితులు బిక్కి అవినాష్, తాటిపర్తి హేమంత్, గుంజి హేమవర్ధన్ నలుగురు విద్యార్థులు గురువారం సాయంత్రం మూడు గంటల సమయంలో ఒక బైక్ మీద చిన్నగంజాం మండలం బాపయనగర్ బీచ్ దగ్గర సముద్రంలో మునగడానికి వెళ్లారు. అవినాష్, శ్రీరామ్ ఇద్దరు సముద్రంలో నీట మునిగి ఆచూకీ తెలియలేదు. హేమంత్, హేమ వర్ధన్ సముద్రం ఒడ్డునే ఉండటంతో క్షేమంగా ఉన్నారు. సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు, స్థానిక పోలీస్, రెవిన్యూ, అగ్నిమాపక శాఖ అధికారుల సమన్వయంతో ఆచూకీ లేకుండా పోయిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో జిల్లాలోని తీర ప్రాంతం ఉలిక్కిపడింది. విద్యార్థులు గల్లంతు కావడం పట్ల స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
 
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రారంభం
రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రారంభం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా...
By Gadiyapudi Narendra 2026-01-03 09:18:12 0 173
Andhra Pradesh
పగిలిన హంద్రీనీవా పైపులైను పరిశీలించిన ఎమ్మెల్యే కోట్ల
కర్నూలు : నంద్యాల : డోన్  డోన్ మండలంలోని ఓబుళాపురం గ్రామ సమీపంలో హంద్రీనీవా పైప్‌లైన్...
By Hari Krishna 2026-01-10 13:57:46 0 175
Rajasthan
बदली बिना बरखा: राजस्थान सूखे की चिंता बढ़ी”
राजस्थान में इन दिनों #मौसम बदली से घेरायो है, पर बारिश नी होय रही। जयपुर सहित कई जिलां में...
By Pooja Patil 2025-09-12 04:41:26 0 176
Andhra Pradesh
బైక్‌పై నుంచి కిందపడి వృద్ధురాలికి తీవ్ర గాయాలు.
చౌడేపల్లి మండలం బోయకొండ రోడ్డు మలుపు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెడుగుట్టపల్లెకు చెందిన...
By Pagadala Venkateswar 2026-03-07 09:26:12 0 102
Andhra Pradesh
విజయవాడ భవానిపురం లో సబ్ స్టేషన్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే సుజనా చౌదరి
పశ్చిమ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం... సబ్ స్టేషన్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే సుజనా...
By Rajini Kumari 2026-03-28 14:19:12 0 120
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com