సుభాష్ నగర్ UPHC కి సొంత భవనం ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే కి వినతి .|

0
124

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సుభాష్‌నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC) నిర్వహణ కోసం ప్రభుత్వ భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ డాక్టర్ నూరీన్ బేగం శనివారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్న కేంద్రం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ఆమె ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా సొంత భవన నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అనిల్ కిషోర్ గౌడ్, వీరేష్, సదానంద్, ప్రభాకర్, మనోజ్, మమత, జీవిత, శ్రీలత, ఉమాదేవి మరియు ఆశా కార్యకర్తలు, తదితరులు  పాల్గొన్నారు.

#sidhumaroju 

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
పదవి విరమణ చేస్తున్న పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు
కృష్ణా జిల్లా పోలీస్   *పదవి విరమణ చేస్తున్న పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు*  ...
By Rajini Kumari 2026-01-03 09:14:03 0 180
Andhra Pradesh
పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు హల్చల్
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో ఆదివారం ఒంటరి ఏనుగు సంచారం స్థానికంగా కలకలం సృష్టించింది....
By Kothuru Murali 2026-04-19 11:18:18 0 61
Andhra Pradesh
రేపు ప్రజాదర్బార్
తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత రెడ్డి గారి నివాసం లో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు . నియోజకవర్గ...
By Gitta Raju 2026-04-16 13:14:25 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com