జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలి జిల్లా కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టులు

0
116

బాపట్ల: జిల్లా వ్యాప్తంగా వివిధ పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అందించే అక్రిడిటేషన్ కార్డ్స్ సంబంధించి జనవరి 30 వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన బాపట్ల జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో ప్రభుత్వ జీవోను 100% పూర్తి స్థాయిలో అమలు చేయడం వలన అనేక మంది చిన్న పత్రికలకు సంబంధించిన జర్నలిస్టులు అక్రిడిటేషన్ లు పొంద లేకపోయారనీ వారు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనేక సంవత్సరాలుగా పత్రికా రంగంలో  కొనసాగుతూ గౌరవప్రదంగా ప్రభుత్వం అందించే అక్రిడిటేషన్ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పరిస్థితులలో ఈ విధంగా తీవ్ర అన్యాయం జరగటం వల్ల అనేకమంది నష్టపోవడం జరిగిందనీ కలెక్టర్ కు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ గా మీకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి    జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో చర్చించి రెండవ జాబితాలో జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్   మంజూరు అయ్యేవిధంగా చొరవ చూపాలని
కలెక్టర్ ను కోరారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
మల్లంపేట లో నియమాలకు విరుద్ధంగా నిర్మాణం చెసినా వాణిజ్య భవనం నిర్మాణం సీల్డ్ చెసిన జిహెచ్ఎంసి
దిండిగల్, మల్లంపేట ఇ మద్య నే మునిసిపాలిటీ నండి ప్రభుత్వం G H M C లో విలీనం చేసిన విషయం...
By Ponnala Srinivasrao 2026-03-04 03:55:38 0 411
Telangana
ఇంద్రనగర్ లేబర్ అడ్డా - శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు .|
మేడ్చల్   మల్కాజిగిరి జిల్లా   వెంకటాపురం డివిజన్ ఇంద్రనగర్ లేబర్ అడ్డా వద్ద...
By Sidhu Maroju 2026-02-19 10:04:22 0 156
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ: గుండెపోటుతో తండ్రి మృతి అనాధలైన.
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, పెద్ద కొండ మర్రి గ్రామానికి చెందిన వై. శ్రీనివాసులు (38)...
By Kothuru Murali 2026-01-18 09:09:53 0 92
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com