శాంతి శ్రీనివాస్ రెడ్డి చొరవ - చినరాయుని చెరువుకు గుర్రపు డెక్క విముక్తి.|

0
135

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ పరిధిలోని చినరాయుని చెరువు ప్రక్షాళనకు ఎట్టకేలకు మోక్షం లభించింది. కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి గత కొన్ని రోజులుగా అధికారులపై ఒత్తిడి తెస్తూ.. నిరంతరం ఫాలో అప్ చేయడంతో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న గుడ్లపుడెక్క తొలిగింపు పనులు ఈరోజు లాంచనంగా ప్రారంభమయ్యాయి.

 

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా పాల్గొని పనులను పర్యవేక్షించారు. వారితోపాటు ఎస్ డబ్ల్యూ మేనేజ్మెంట్ డిఇ. సత్యనారాయణ, ఏ.ఇ. సమీర్, ఎంటమాలజీ ఏఇ. అనిల్, ఎస్ ఎఫ్ ఏ వెంకట్రామిరెడ్డి, మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

 

స్థానిక కాలనీలో ప్రజలు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చి, కార్పోరేటర్ చేసిన కృషిని అభినందించారు.

 

చెరువులో గుర్రపు డెక్క విపరీతంగా పెరగడం వల్ల దోమల ఉధృతి పెరిగి, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది ప్రజారోగ్యానికి ముప్పుగా మారిందని కార్పొరేటర్ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.

 

నీటి ప్రవాహాన్ని మెరుగుపరచడం, మరియు పారిశుద్ధాన్ని కాపాడడం ద్వారా పరిసర ప్రాంతాల ప్రజలకు ఊరట లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

 

పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకుండా వేగవంతంగా పూర్తి చేసి చెరువును పూర్తిస్థాయిలో గుర్రపు డెక్క రహితంగా తీర్చిదిద్దాలని ఆమె అధికారులను ఆదేశించారు. 

 

దీనికి అధికారులు స్పందిస్తూ.. అవసరమైన యంత్రాలను మొహరించి వీలైనంత త్వరగా ప్రక్షాళన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

 

స్థానిక సమస్యల పరిష్కారంలో నిరంతరం ముందుంటున్న కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డికి, సమీప కాలనీ నివాసితులు ధన్యవాదాలు తెలిపారు.

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
సాంకేతిక కారణాల వలన తాత్కాలికంగా వాయిదా
మహబూబాబాద్, డిసెంబర్ 21(భారత్ అవాజ్): ముందుగా తెలిపిన షెడ్యూల్ ప్రకారం సోమవారం రోజున మహబూబాబాద్...
By Bittu Bittu 2025-12-21 12:55:48 0 309
Andhra Pradesh
మదనపల్లి లో ప్రశాంతంగా జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు.
మదనపల్లె జవహర్ నవోదయ పాఠశాలలో 11వ తరగతి, 4వ తరగతి ప్రవేశ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. 11వ...
By Pagadala Venkateswar 2026-02-08 10:51:11 0 104
Andhra Pradesh
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే కొండయ్య
నేడు చీరాలలో ఎన్ఆర్పిఎం హై స్కూల్ సందర్శించిన సందర్భంగా విద్యార్థులతో కలిసి చీరాల శాసనసభ్యులు...
By Vadlamudi NagaVenkat 2026-03-17 06:12:42 0 576
Andhra Pradesh
మదనపల్లె: మహిళా రైతుపై తేనెటీగల దాడి.. తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలోని కోటవారిపల్లిలో మంగళవారం మహిళా రైతు సిద్ధమ్మ (59)పై తేనెటీగలు దాడి చేశాయి....
By Pagadala Venkateswar 2026-03-25 02:54:31 0 86
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com