46వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన హోంగార్డ్‌ G.కృష్ణ కిషోర్ ను అభినందించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు.

0
29

📍కేరళ రాష్ట్రం తిరువనంతపురం నగరంలోని చంద్రశేఖర్ నాయర్ స్టేడియంలో తేది. 28.01.2026 నుండి 01.02.2026 వరకు నిర్వహించిన 46వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ – 2026లో గుంటూరు జిల్లా హోం గార్డ్ జి. కృష్ణ కిషోర్ పాల్గొని గణనీయమైన ప్రతిభను ప్రదర్శించారు.

📍ఈ పోటీలలో 30+ వయో వర్గం – 5 కిలోమీటర్ల రేస్ వాక్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన 00:32:40.2 సెకన్ల సమయంలో రేస్ పూర్తి చేసి రెండవ స్థానం సాధించి రజత పతకాన్ని గెలుచుకున్నారు.

🚩 ఈ సందర్భంగా ఈ రోజు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారిని హోంగార్డ్ జి. కృష్ణ కిషోర్‌ మర్యాదపూర్వకంగా కలిసి, తాను పతకం సాధించిన విషయాన్ని ఎస్పీ గారికి తెలుపగా ఎస్పీ గారు అభినందనలు తెలిపారు.

📍భవిష్యత్తులో జరగబోయే పోటీలలో మరిన్ని పతకాలు సాధించి గుంటూరు జిల్లా పేరు ప్రతిష్టలను మరింత ఉన్నతంగా నిలబెట్టాలని ఆకాంక్షించారు.

📍గుంటూరు జిల్లా పోలీస్ శాఖ తరఫున హోంగార్డ్ జి. కృష్ణ కిషోర్‌కు గౌరవ ఎస్పీ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

👉ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఏఆర్ శ్రీ ఏ హనుమంతు గారు, హోమ్ గార్డు ఆర్ఐ రామకృష్ణ రెడ్డి గారు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:కొలింపల్లి గ్రామం వద్ద కుక్కల గుంపు దాడిలో జింక మృతి
పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం, దిగువపల్లి పంచాయతీ, కోలింపల్లి గ్రామ సమీపంలో ఆదివారం...
By Kothuru Murali 2026-02-15 07:30:26 0 29
Andhra Pradesh
రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు..
రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు.. ఏపీ: కొత్త ఏడాదిలో రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలు...
By Gadiyapudi Narendra 2025-12-28 16:36:26 0 145
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com