సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి: TSCPSEU

0
1K

 

​కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 4: తెలంగాణ రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ వాయిదాల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ (TSCPSEU) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ రవిచంద్ర డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడ మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏలను వాయిదాల రూపంలో చెల్లించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో డీఏలను చెల్లించకుండా వాయిదాల సంఖ్యను పెంచుకుంటూ పోవడం వల్ల ప్రస్తుతం అవి 60కి చేరాయని తెలిపారు. ఈ వాయిదాల ద్వారా రావలసిన మొత్తం సుమారు రూ. 1200 కోట్లకు చేరడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.

​ప్రభుత్వం ప్రతి నెల విడుదల చేస్తున్న రూ. 700 కోట్ల నిధులలో భాగంగా ఈ నెల తప్పనిసరిగా సీపీఎస్ బకాయిల కోసం కేటాయించాలని కోరారు. అలాగే గత ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణలో పాత పెన్షన్ విధానాన్ని (OPS) అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

​ఈ కార్యక్రమంలో TSCPSEU మండల అధ్యక్షుడు వాసం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి సువర్ణపాక కృష్ణ, మండల బాధ్యులు జాడి ప్రభాకర్, సుభాష్, మహిళా కార్యదర్శి రాజేంద్ర, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీపీఎస్ సంఘ బాధ్యులు, మరియు పలువురు సీపీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Bharat
Shri Rahul Gandhi Shifted to New Home.
Shri Rahul Gandhi, Honble LoP , Rae Bareli MP has shifted to No. 5, Sunhari Bagh Road, New Delhi...
By Bharat Aawaz 2025-06-19 12:35:50 0 2K
Andhra Pradesh
మదనపల్లిలో మినీ స్టేడియం నిర్మాణ కసరత్తు: ఎమ్మెల్యే.
అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిని ప్రకటించిన నేపథ్యంలో, కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం మినీ...
By Pagadala Venkateswar 2026-02-03 06:28:04 0 101
Telangana
నిజామాబాద్. శ్రీ జండా బాలాజీ ఆలయం ముసివేత
 నిజామాబాద్ గోల్హనుమాన్ శ్రీ జండా బాలాజీ మందిరని చంద్రగ్రహణం సందర్భంగా ముసివేషారు. ఉదయo...
By Sadaq Sadaq 2026-03-03 08:31:27 0 160
Telangana
పార్లమెంట్లో ఏ బిల్లు అయినా ఓటింగ్ తలుపులు మూసే చేస్తారు..CM రేవంత్ రెడ్డి
ఆంధ్ర, తెలంగాణ విభజన ఓటింగ్ తలుపులు మూసి చేశారని బుర్ర లేని వాళ్ళు అలా మాట్లాడతారు, లగడపాటి...
By Ponnala Srinivasrao 2026-04-19 01:30:39 0 76
Andhra Pradesh
పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలి
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా బొబ్బిలి పట్టణంలో ద్విచక్ర వాహనాలను నడిపిస్తూ నిరసన...
By Boiena Rajesh 2026-05-17 01:00:32 0 65
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com