Chandrababu Naidu: నేడు ఏపీ కేబినెట్ బేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ

0
115

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 10.30 గంటలకు కేబినెట్ సమావేశం

వివిధ కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న కేబినెట్

 

తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ చేస్తున్న విమర్శలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు మంత్రి వర్గ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో తిరుమల లడ్డూ రాజకీయం, వైసీపీ నేతల దాడులు, అరెస్టుల అంశాలపై సమగ్ర చర్చ జరగనున్నట్లు సమాచారం. అలాగే అసెంబ్లీ సమావేశాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేయనున్నారు. 

 

సమావేశంలో రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, సంక్షేమ పథకాల అమలు, పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా కేబినెట్ చర్చించనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, పెట్టుబడులు, పరిశ్రమలకు సంబంధించిన నిర్ణయాలతో పాటు మరికొన్ని కీలక అంశాలపై కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గత కేబినెట్‌లో 30కి పైగా అంశాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా, వారం రోజుల్లోనే మరోసారి సమావేశం కావడంతో ఈసారి కూడా ఎజెండా 30కి పైగా అంశాలు ఉండొచ్చని అంచనా. 

 

కేబినెట్‌ సమావేశం ఎజెండా పూర్తయిన అనంతరం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగే అవకాశముంది. ప్రధానంగా తిరుమల లడ్డూ వ్యవహారంపై వైసీపీ చేస్తున్న విమర్శలు, ఇతర అంశాలు, అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలపైనా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా సంయమనం పాటించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే నేతలకు సూచించారు. 

Search
Categories
Read More
Telangana
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత.|
     మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 18 మంది బలి...
By Sidhu Maroju 2026-03-30 16:48:43 0 176
Andhra Pradesh
గాంధీ నగర్ లో ఉన్నటువంటి st కాలనీ లోని ప్రజలతో శక్తి యాప్ పై అవగాహన సదస్సు.
చీరాల: చీరాలలోని గాంధీ నగర్ లో ఉన్నటువంటి st కాలనీ లోని ప్రజలతో శక్తి యాప్ పై అవగాహన సదస్సు....
By Gadiyapudi Narendra 2026-03-26 17:20:49 0 207
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు ప్రముఖ పుణ్యక్షేత్రం బోయ కొండలో క్యూఆర్ కోడ్ స్కానర్లు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో మంగళవారం మధ్యాహ్నం ఆలయ ఉప...
By Kothuru Murali 2026-02-11 08:42:59 0 111
Telangana
బండి సంజయ్ కొడుకు రౌడీయిజం ...
బండి సంజయ్ కొడుకు రౌడీయిజం  ‎కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కొడుకు బండి సాయి...
By Ponnala Srinivasrao 2026-05-10 03:20:11 0 86
Andhra Pradesh
డీఐజీ ప్రకటన గంటల్లోనే నిందితుడు శవమై తేలిన ఘటన.
మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు కులవర్ధన్ మంగళవారం కనసానివారిపల్లి...
By Pagadala Venkateswar 2026-02-18 06:48:35 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com