Chandrababu Naidu: నేడు ఏపీ కేబినెట్ బేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ

0
147

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 10.30 గంటలకు కేబినెట్ సమావేశం

వివిధ కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న కేబినెట్

 

తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ చేస్తున్న విమర్శలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు మంత్రి వర్గ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో తిరుమల లడ్డూ రాజకీయం, వైసీపీ నేతల దాడులు, అరెస్టుల అంశాలపై సమగ్ర చర్చ జరగనున్నట్లు సమాచారం. అలాగే అసెంబ్లీ సమావేశాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేయనున్నారు. 

 

సమావేశంలో రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, సంక్షేమ పథకాల అమలు, పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా కేబినెట్ చర్చించనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, పెట్టుబడులు, పరిశ్రమలకు సంబంధించిన నిర్ణయాలతో పాటు మరికొన్ని కీలక అంశాలపై కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గత కేబినెట్‌లో 30కి పైగా అంశాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా, వారం రోజుల్లోనే మరోసారి సమావేశం కావడంతో ఈసారి కూడా ఎజెండా 30కి పైగా అంశాలు ఉండొచ్చని అంచనా. 

 

కేబినెట్‌ సమావేశం ఎజెండా పూర్తయిన అనంతరం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగే అవకాశముంది. ప్రధానంగా తిరుమల లడ్డూ వ్యవహారంపై వైసీపీ చేస్తున్న విమర్శలు, ఇతర అంశాలు, అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలపైనా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా సంయమనం పాటించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే నేతలకు సూచించారు. 

Search
Categories
Read More
SURAKSHA
S. Ajeetha Begum, IPS: Inspiring Leadership in Modern Policing
The Journey Begins "Leadership is not measured by rank alone, but by the lives we protect and...
By Fathima Safa 2026-07-16 13:18:39 0 70
Bharat Aawaz
⚖️ When Justice Fails: The Chilling Story of Suresh, the Innocent Villager Jailed for a Crime That Never Happened
In the heart of Karnataka, a terrifying example of justice gone wrong unfolded one that shook...
By Citizen Rights Council 2025-07-07 11:35:05 0 2K
Business & Finance
Indian Chamber of Commerce Targets ₹1 Lakh Crore Investments in West Bengal
The Indian Chamber of Commerce (ICC) has announced plans to mobilise nearly ₹1 lakh crore in...
By Navya Sree 2026-07-04 06:39:07 0 23
Business & Finance
Share Transfer Process for Smooth Business Ownership
A share transfer is the legal process of transferring ownership of shares from one shareholder to...
By Navya Sree 2026-07-20 05:34:11 0 21
Telangana
"నిషేధిత పత్తి విత్తనాల స్మగ్లింగ్‌పై మల్కాజిగిరి పోలీసుల భారీ ఆపరేషన్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : శామీర్‌పేట్ పరిధిలో నిషేధిత బీటీ-3 (BG-III HP వెరైటీ) పత్తి...
By Sidhu Maroju 2026-05-11 12:41:58 0 249
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com