Chandrababu Naidu: నేడు ఏపీ కేబినెట్ బేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ

0
114

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 10.30 గంటలకు కేబినెట్ సమావేశం

వివిధ కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న కేబినెట్

 

తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ చేస్తున్న విమర్శలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు మంత్రి వర్గ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో తిరుమల లడ్డూ రాజకీయం, వైసీపీ నేతల దాడులు, అరెస్టుల అంశాలపై సమగ్ర చర్చ జరగనున్నట్లు సమాచారం. అలాగే అసెంబ్లీ సమావేశాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేయనున్నారు. 

 

సమావేశంలో రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, సంక్షేమ పథకాల అమలు, పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా కేబినెట్ చర్చించనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, పెట్టుబడులు, పరిశ్రమలకు సంబంధించిన నిర్ణయాలతో పాటు మరికొన్ని కీలక అంశాలపై కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గత కేబినెట్‌లో 30కి పైగా అంశాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా, వారం రోజుల్లోనే మరోసారి సమావేశం కావడంతో ఈసారి కూడా ఎజెండా 30కి పైగా అంశాలు ఉండొచ్చని అంచనా. 

 

కేబినెట్‌ సమావేశం ఎజెండా పూర్తయిన అనంతరం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగే అవకాశముంది. ప్రధానంగా తిరుమల లడ్డూ వ్యవహారంపై వైసీపీ చేస్తున్న విమర్శలు, ఇతర అంశాలు, అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలపైనా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా సంయమనం పాటించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే నేతలకు సూచించారు. 

Search
Categories
Read More
Telangana
Hyderabad. Police Commissioner. V.C. Sjjanar press note.|
  Hyderabad :  Hyderabad City Police Commissioner  V. C. Sajjanar, IPS, called...
By Sidhu Maroju 2025-12-20 16:51:00 0 424
Telangana
నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనo
ఈరోజు. మహిళ బిల్లుకు వ్యాతిరేకంగా నీలిచిన కాంగ్రెస్ ప్రభుత్వ డిష్టిబొమ్మ దహనం చేయయం జరిగింది....
By Sadaq Sadaq 2026-04-19 13:20:01 0 83
Telangana
కాలనీ సమస్యలను తొలగించే దిశగా కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటన.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్134 (ఓల్డ్) డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్...
By Sidhu Maroju 2025-12-19 08:29:30 0 180
Goa
Cashew Yield in South Goa Halves as Weather Patterns Disrupt Crop Cycle
South Goa’s cashew production has dropped by approximately 50%, driven by unfavorable...
By Bharat Aawaz 2025-07-17 06:26:34 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com