ఐహెచ్ఆర్సి జెనీవా జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా న్యాయవాది రాజేశ్వరి

0
128

చీరాల:  అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్  ఐ హెచ్ ఆర్ సి జెనీవా ఇండియన్ నేషనల్ చాప్టర్‌కు జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా చీరాలకి చెందిన న్యాయవాది రాజేశ్వరి చేబ్రోలును నియమించారు. ఈ మేరకు ఐ హెచ్ ఆర్ సి జెనీవా భారత జాతీయ అధ్యక్షుడు,అంతర్జాతీయ రాయబారి డాక్టర్ కె. రాజానందన్ విజ్ఞాన్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక మండలి తో సంప్రదింపుల హోదా కలిగి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హై కమిషనర్ కార్యాలయం తో అనుబంధంగా పనిచేస్తున్న ఐ హెచ్ ఆర్ సి,జెనీవా మానవ హక్కుల పరిరక్షణ, శాంతి ప్రోత్సాహానికి కట్టుబడి ఉన్న ప్రపంచవ్యాప్త సంస్థగా గుర్తింపు పొందింది.
రాజేశ్వరి చేబ్రోలు నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని, ఆమె పదవీకాలం రెండేళ్లుగా ఉంటుందని పనితీరు సంతృప్తికరంగా ఉంటే పునరుద్ధరణకు అవకాశం ఉంటుందని తెలిపారు. జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఆమె జాతీయ, ప్రాంతీయ సమావేశాలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు, ఈవెంట్ల నిర్వహణ, లాజిస్టిక్స్ సమన్వయం, రాష్ట్ర కమిటీలు,అంతర్జాతీయ భాగస్వాములతో అనుసంధానం వంటి కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు.అలాగే ఈవెంట్ల డాక్యుమెంటేషన్, నివేదికల తయారీతో పాటు జాతీయ అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి అప్పగించే ఇతర విధులను కూడా నిర్వర్తించనున్నారు.
ఈ సందర్భంగా ఐ హెచ్ ఆర్ సి జెనీవా ఆమె నియామకానికి అభినందనలు తెలియజేసింది.మానవ హక్కుల పరిరక్షణ దిశగా ఆమె సేవలు సంస్థకు మరింత బలాన్ని చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

 

#Narendra

Search
Categories
Read More
Karnataka
Karnataka's 'Shakti Scheme': Free Bus Travel for Women Starts September 1st
New Scheme: The Karnataka government has launched the 'Shakti Scheme,' a new program to provide...
By Triveni Yarragadda 2025-08-11 14:35:18 0 1K
Madhya Pradesh
A Historic Era Concludes: Smt. Rashmi Shukla Ji Maharashtra’s First Woman DGP, Retires After 37.5 Years of Distinguished Service
MUMBAI, January 4, 2026 — A historic chapter in Indian law enforcement reached its poignant...
By Venugopal Gopal 2026-01-04 16:16:48 0 2K
Andhra Pradesh
గుర్తుతెలియని వాహనం ఢీకొని డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
మంగళవారం రాత్రి పుంగనూరు మండలం మొరంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ బస్సు డ్రైవర్...
By Kothuru Murali 2026-02-25 11:11:57 0 127
Andhra Pradesh
అన్నమయ్య లో శాంతియుతంగా శ్రీరామనవమి జరుపుకోండి: ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ప్రజలు శ్రీరామనవమి పండుగను శాంతియుతంగా, సంతోషంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్...
By Pagadala Venkateswar 2026-03-27 04:14:26 0 85
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com