చరిత్రలో లేని విధంగా నూతన అధ్యాయానికి నాంది పలికిన ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్.

0
122

వక్ఫ్ బోర్డు చరిత్రలో తొలిసారి. 

చరిత్రలో లేని విధంగా నూతన అధ్యాయానికి నాంది పలికిన ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్.

రేపు కసుమూరు లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అన్నదాన సత్రం ప్రారంభం.

హాజరుకానున్న మైనారిటీ మంత్రి శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి నస్యం మొహమ్మద్ ఫరూక్.

గతంలో ఎప్పుడూ లేని విధంగా, వక్ఫ్ బోర్డు చరిత్రలోనే ఒక వినూత్న అధ్యాయానికి నాంది పలికారు ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్. ఆయన నాయకత్వంలో ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో కసుమూరు లో నిత్య అన్నదాన సత్రం (లంగర్ ఖానా) తో పాటు “తాలిం-ఎ-హునార్” పేరుతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను రేపు ఘనంగా ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి మైనారిటీ శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి నస్యం మొహమ్మద్ ఫరూక్, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు పనబాక లక్ష్మి హాజరుకానున్నారు. పేదలు, అనాధలు, దర్గా దర్శనానికి వచ్చే భక్తులకు ప్రతిరోజూ భోజనం అందించడమే లక్ష్యంగా నిత్య అన్నదాన సత్రం ఏర్పాటు చేయడం విశేషం. అదే సమయంలో, మైనారిటీ యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగేందుకు “తాలిం-ఎ-హునార్” స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించడం వక్ఫ్ బోర్డు సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలిచింది. ప్రథమంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్ల శిక్షణ అందించి శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మిషన్లు అందజేయనున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, వక్ఫ్ ఆస్తులు కేవలం పరిరక్షణకే కాదు, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడాలి. నిత్య అన్నదానం, నైపుణ్య శిక్షణ ద్వారా వక్ఫ్ బోర్డు సామాజిక సేవలో కొత్త చరిత్ర సృష్టిస్తోంది అని తెలిపారు. స్థానికులు, ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, వక్ఫ్ బోర్డు చరిత్రలో ఇది మైలురాయిగా నిలుస్తుందని కొనియాడారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కె.నాగలాపురం గ్రామంలో 26 తేదీన యాక్సిడెంట్
కర్నూలు జిల్లా కె.నాగలాపురం గ్రామంలో 26 తేదీన యాక్సిడెంట్ ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర జరిగిన...
By mahaboob basha 2025-08-31 00:49:50 0 456
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇంటర్లో సత్తా చాటిన విద్యార్థులు
రోడ్డు ప్రమాదంలో మరణించినా.. ఇంటర్‌లో సత్తా చాటిన విద్యార్థులు   Apr 13, 2026, ...
By Rajini Kumari 2026-04-13 08:14:03 0 99
Telangana
నిజామాబాద్
ఈ రోజు శని అమావాస్య సందర్భంగా ఇందూర్ నగర ఎమ్మెల్యే శ్రీ ధన్‌పాల్ సూర్యనారాయణ గారు జహీరాబాద్...
By Sadaq Sadaq 2026-05-16 17:02:55 0 49
Rajasthan
Teenage Sensation Vaibhav Sooryavanshi Powers Royals’ Victory
Fifteen-year-old batting prodigy Vaibhav Sooryavanshi left spectators completely spellbound in...
By Dunna Jessicaruth 2026-05-20 10:17:56 0 47
Telangana
రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బిజెపి.
BREAKING    గోశామహల్ ఎమ్మెల్యే,  రాజాసింగ్ బీజేపీ పార్టీ కి.. ఎమ్మెల్యే పదవికి...
By Sidhu Maroju 2025-07-11 08:51:49 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com