స్కూల్ విద్యార్థులకు శక్తి బృందం అవగాహన కార్యక్రమం

0
161
చీరాల: బాపట్ల జిల్లా ఎస్పీ, బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ మోయిన్ సూచనలతో ఇంకొల్లు పరిధిలోని ఇంకొల్లు ఆదర్శ పాఠశాలలో సోమవారం హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఇంకొల్లు, ఎస్ ఐ సురేష్, ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం నిర్వహించింది. ఈ సందర్భంగా శక్తి బృందం ఎస్ఐ ఏ. హరిబాబు మాట్లాడుతూ, మహిళలు మరియు బాలికలు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం పొందేందుకు శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ యాప్ ద్వారా ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలు వంటి సంఘటనలను అరికట్టవచ్చని తెలిపారు.
అలాగే విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తూ, ఎవరైనా వేధింపులకు గురిచేస్తే వెంటనే తల్లిదండ్రులకు లేదా పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా వచ్చే ఫేక్ న్యూస్‌కు దూరంగా ఉండాలని హితవు పలికారు.
సమస్యలు ఎదురైనప్పుడు 100, 112, 181, 1091, 1098 వంటి హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా పోక్సో చట్టం (చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం)పై, అలాగే మహిళల రక్షణకు అవసరమైన సెల్ఫ్ డిఫెన్స్ అంశాలపై కూడా అవగాహన కల్పించారు.
 
జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో జిల్లా శక్తి బృందాలు పాఠశాల విద్యార్థులకు మరియు మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ పై స్పష్టమైన అవగాహన, డెమో ద్వారా సరైన స్పర్శ–అసహజ స్పర్శ మధ్య తేడా వివరించారు.
అత్యవసర సమయంలో తక్షణ సహాయానికి శక్తి యాప్  వినియోగంపై మార్గనిర్దేశం చేశారు.
Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ లాంఛనాలతో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ప్రముఖ భారతీయ సంఘసంస్కర్త కులు వ్యతిరేక ఉద్యమకారుడు మహిళా విద్యాదాత అన్నగారిన వర్గాల సమానత్వం...
By Benguluri Madhubabu 2026-04-11 06:54:26 0 122
Telangana
రెండో విడత పోలింగ్ లో కాంగ్రెస్ హవా నా..?
మండలం లో రేపు పోలింగ్ నిర్వహించన్ను నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన పళ్ళు వర్గాలు మెజారిటీ...
By Krishna Balina 2025-12-13 12:56:41 0 258
Andhra Pradesh
రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న బైక్.. ముగ్గురికి తీవ్ర గాయాలు.
గుర్రంకొండ రెడ్డివారిపల్లికి చెందిన రామాంజులు మదనపల్లెలోని చిప్పిలిలో రోడ్డు దాటుతుండగా, కర్ణాటక...
By Pagadala Venkateswar 2026-04-25 04:34:11 0 57
Telangana
ఎయిర్పోర్ట్ పనులను వేగవంతం చేయాలన్న కలెక్టర్....
ఎయిర్పోర్టు పనులు వేగవంతం చేయాలి: వరంగల్ కలెక్టర్ భారత్ అవాజ్ న్యూస్: 14 మే రోజున వరంగల్...
By Gujile Ramu 2026-05-14 01:28:24 0 60
Telangana
మంచిర్యాలలో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి నివాళి
డా వివేక్ వెంకటస్వామి  మంచిర్యాల ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డా. బి. ఆర్....
By Avunoori Mahesh 2026-04-14 05:41:04 0 155
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com